Home » Karimnagar
రామగుం డం ఎన్టీపీసీలో సోమవారం జాతీయ అగ్నిమాపక(ఫైర్ సర్వీస్) వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతీ య ఫైర్ సర్వీస్ డే సంద ర్భంగా వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను ఎన్టీపీసీ జీఎం ఎ.కె.త్రిపాఠి ప్రారంభిం చారు.
ప్రపంచం గర్వించదగ్గ గొప్పుమేధావి బాబాసాహేబ్ అంబేడ్కర్ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అంబేద్కర్ జయంతి సం దర్భంగా సోమవారం బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబే ద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామిక దేశమైన దేశానికి రాజ్యాంగాన్ని అందించారని, దేశాభివృద్ధికి అంబేడ్కర్ దిశానిర్ధేశం చేశారని తెలిపారు.
యువకులంతా అంబేడ్కర్ అడుగు జాడల్లో నడవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నా రు. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళుల ర్పించారు. అంబేడ్కర్ ఒక కులానికో మతానికో చెందిన వాడు కాదని ఆయన అందరి వాడన్నారు. దేశంలో రాజ్యాం గాన్ని మార్చే కుట్ర జరుగుతుందని, ప్రజలంతా కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబుపత్రాల మూల్యంకనం (స్పాట్)లో నిబంధనలను పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాధికారి సీహెచ్వీఎస్ జనార్ధన్రావు వైఖరితో మూల్యంకన కేంద్రం గందరగోళంగా మారిందని, స్పాట్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మనోవేదనకు గురువుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలకు నిరీక్షణ తప్పడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర అవుతున్నా నామినేటెడ్ పదవుల నియామకంలో ఇంకా కొన్ని అవకాశాలను భర్తీ చేయడం లేదు. ప్రధానంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి పలు పదవులతో పాటు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆలయాల చైర్మన్ల పదవులపై కన్నేసిన నాయకులు నిర్విరామంగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తునే ఉన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 జిల్లా రవాణాశాఖ ఖజానా గలగల లాడింది. రూ.39.25 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 2024-25 అర్థిక సంవత్సరం రూ.1.55 కోట్లు అదనంగా ఆదాయం సమకూరింది. 2022 -23 అర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ. 33.08 కోట్ల ఆదాయం వచ్చింది.
ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ వర్తింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈనెల 14 తేదీ నుంచి దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయించారు. ఆ మేరకు ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు.
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని, బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతుం దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ ఆరోపించారు. శనివారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు.
ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో గాం ఛలో-బస్తీ ఛలోలో భాగంగా ఆయన పర్యటించారు. బైక్ర్యాలీ నిర్వహించి అంగన్వాడీ సెంటర్ను, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని తనిఖీ చేశారు.
మహానీయుల జయం తి ఉత్సవాలలో భాగంగా గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళా శాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు క్విజ్, రంగోలి పోటీలు నిర్వహించారు.