Home » Kukatpally
జీహెచ్ఎంసీ మూసాపేట్ సర్కిల్ టౌన్ప్లానింగ్ అధికారులు శనివారం బాలాజీనగర్(Balajinagar)లోని హెచ్ఐజీ 53లో అక్రమ నిర్మాణం అంటూ చేపట్టిన కూల్చివేతలు దుమారం లేపాయి. 267 గజాల్లో స్టిల్ట్ ప్లస్ 3 అంతస్తులకు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించా రు. ఏడాది క్రితమే భవనం పూర్తయి ప్రస్తుతం ఐదో అంతస్తులోని రెండు ఫ్లాట్స్లో ఒకదాంట్లో గత తొమ్మిది నెలలుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది.
కూకట్పల్లి(Kukatpally)లో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్పాత్ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి సీనియర్ సబ్ ఎడిటర్ జే పవన్ కుమార్ (57) అనారోగ్యంతో మృతిచెందారు.
హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ(56) అనే మహిళ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది.
‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం’ అన్నచందంగా తయారైంది జేఎన్టీయూ(JNTU) పరిధిలోని అటానమస్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి. యూనివర్సిటీ పరిధిలో దాదాపు 80 అటానమస్ హోదా కలిగిన ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండ గా, సగానికి పైగా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిలిపివేశారు.
హైడ్రా చర్యలతో మధ్య తరగతి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. కూకట్పల్లి నల్లచెరువులో ఆదివారం హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఆ బస్సు హెల్పర్ను కూకట్పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది.
చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే, హైడ్రా పేరుతో చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారికి ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. ట్రాఫిక్ సమస్య. అలాంటి మహానగరంలో రహదారిపై ఓ వాహనం సాంకేతిక సమస్యతో ఆగిపోయిందంటే.. ఇక వాహనదారులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ సమస్యను పట్టించుకోవడం ఎప్పుడో మానేసి.. వాహనదారులకు చలానాలు రాసే పనిలో వారంత నిమగ్నమైపోయారు.