Home » Manipur
మణిపూర్లో ఇద్దరు మహిళలను దారుణంగా, నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘాటుగా స్పందించారు. ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 30 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మణిపూర్లో మెయిటీ, కుకీ జాతుల మధ్య హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందువల్ల ఈ వీడియోను తొలగించాలని ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
మణిపూర్లో కుకీ స్త్రీలను నగ్నంగా ఊరిగించి అత్యాచారం, హత్యపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మణిపూర్లో హింసాత్మక సంఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఆరోపించారు. ఆ రాష్ట్రంలో అంతర్యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు ఓ పాత వీడియో బయటపడిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, భారత్ను బీజేపీ ఇలా దిగజార్చిందని వ్యాఖ్యానించారు.
సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తూ, సుదీర్ఘ కాలం ఇంటర్నెట్ సదుపాయాన్ని నిషేధిస్తున్న ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేయడం వల్ల ఉగ్రవాదం, హింస తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు.
మణిపూర్లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.
మణిపూర్ లో రెండు నెలల క్రితం చెలరేగిన హింసాకాండ ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో 150 నుంచి 200 మంది అల్లరిమూక రెచ్చిపోయి రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. శుక్రవారం అర్థరాత్రి వరకూ చెదురుమదురు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనల్లో ఎవరైనా మృతి చెందారా అనేది వెంటనే తెలియలేదు
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్లో తాజా పరిస్థితిపై స్థాయీ నివేదకను ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి అప్డేడెట్ సమాచారాన్ని తమకు అందజేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు.