Home » Manipur
రెండు నెలల నుంచి మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ (Manipur Chief Minister N Biren Singh) ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హింస చెలరేగుతున్నట్లు కనిపిస్తోందన్నారు.
హైడ్రామా మధ్య తన రాజీనామా నిర్ణయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ శుక్రవారంనాడు వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుతుల్లో తాను రాజీనామా చేయడం లేదంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా ఉదయం నుంచి నుపిలాల్ క్లాంప్లెక్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు శాంతించారు.
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్లో బాధిత ప్రజలను కలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చలించిపోయారు. వారికి ఎదురైన కష్టం తన గుండెను కలిచివేసిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం నుపి లాల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని, ఈ సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయవద్దని బిరేన్ సింగ్ను డిమాండ్ చేశారు.
హింసాత్మక పరిస్థితులతో అట్టుడికిపోతున్న మణిపూర్ సందర్శనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అక్కడికి చేరుకున్నారు. 2 రోజులపాటు హింసాత్మక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అయితే రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుంచి ఉద్రిక్త పరిస్థితులు అధికంగా ఉన్న చురచంద్పుర్కి బయలుదేరిన రాహుల్ కాన్వాయ్ని రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు.
దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడికిపోతున్న మణిపూర్ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు వచ్చిన సైన్యాన్ని స్థానిక మహిళలు అడ్డుకుంటున్నారు. సైనిక వాహనాలు నడవకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లను తవ్వేస్తున్నారు. వీరి రక్షణతో హింసాత్మక నిరసనకారులు తప్పించుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు తమకు సహకరించాలని సైన్యం ట్విటర్ వేదికగా ప్రజలందరినీ కోరింది.
మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంఫాల్ ఈస్ట్లోని ఐతమ్ గ్రామంలో మిలిటెంట్లను విడిపించుకునేందుకు దాదాపు 1200 మంది మహిళలు చుట్టుముట్టడంతో కేవైకేఎల్గ్రూ ప్కు చెందిన 12 మంది మెయిటీ మిలిటెంట్స భ్యులను ఆర్మీవిడుదల చేసింది.
మణిపూర్లో హింసాకాండ శుక్రవారం రాత్రి మళ్లీ ప్రారంభమైంది. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు మే 3న ప్రారంభించిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారి, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఈ రాష్ట్రాన్ని సందర్శించి రాష్ట్రంలోని అన్ని వర్గాల నేతలతో మాట్లాడినప్పటికీ ప్రశాంతత నెలకొనడం లేదు.
ఇంఫాల్లోని కాంగ్బ ప్రాంతంలో తన ఇంటిపై ఆందోళననకారులు దాడి చేసి, దహనం చేయడంపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు, దిగ్భ్రాంతికి గురిచేసిందని, మణిపూర్లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
మణిపూర్లో హింసాకాండ ఆగడం లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా రంగంలోకి దిగి అన్ని వర్గాలతో చర్చలు జరిపినప్పటికీ నిరసనకారులు వెనుకంజ వేయడం లేదు. తాజాగా గురువారం విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ (RK Ranjan Singh) నివాసంపై దాడి చేసి, దహనం చేశారు.