Home » Narendra Modi
థాయ్లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్డ్ ఆహ్వానం మేరకు థాయ్లాండ్ వెళ్తున్న మోదీ.. ఏప్రిల్ 3,4 తేదీల్లో బ్యాంకాక్లో జరిగే 'బే ఆఫ్ బెంగాల్ ఇనీషిటేయటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' సదస్సులో పాల్గొంటారు.
Modi - Muhammad Yunus: పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ దేశంలో హిందువులపై హింసాత్మక దాడులు తీవ్రమయ్యాయి. ఇరుదేశాల మధ్య దూరం పెరుగుతున్న సమయంలో బుధవారం 53వ స్వాతంత్ర్య దినోత్సవం చేసుకున్న బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)కు ప్రత్యేక లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. ఆధునిక ఇంజనీరింగ్తో ప్రజలను, ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్తో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం.
బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, 'సౌగత్-ఏ-మోదీ' ముస్లింల సంక్షేమానికి చేపట్టమని విశిష్ట కార్యక్రమమని, పేద ముస్లిం కుటుంబాలకు ఈద్ను ఆనందంగా జరుపుకునేందుకు వీలుకల్పిస్తుందని చెప్పారు.
హింసాకాడంతో అట్టుడికిన మణిపూర్లో గత 22 నెలల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 60,000 మంది నిరాశ్రయులై సహాయ, పునరావస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని జైరామ్ రమేష్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ప్రపంచానికి శాంతి అనేది చాలా కీలకమని, యుద్ధరంగంలో శాంతి సాధ్యం కాదని నరేంద్ర మోదీ అనేవారని, చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతిని తీసుకువచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందని శశిథరూర్ అన్నారు.
సునీతా విలియమ్స్ బుధవారం తెల్లవారుజామున భూమ్మీద అడుగుపెట్టనుంది. ఆమెతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన బచ్ విల్మోర్ కూడా కిందకు రానున్నాడు. నాసా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
కుంభమేళా విజయవంతం కావడానికి సమిష్టి కృషి కారణమని ప్రధాని మోదీ లోక్సభలో అన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన కర్మయోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42శాతానికి పెంచాలని రెండు బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
ఆదివారంనాడు ఢిల్లీకి వచ్చిన గిబ్బార్డ్ తొలుత ఇంటెలిజెన్స్ సహకారంపై భారత అధికారులతో చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ అధ్యక్షతన జరిగిన 20 దేశాల ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ అధికాకుల సంయుక్త సదస్సులో పాల్గొన్నారు.