Home » Peddapalli
దేశ ఆర్థిక అభివృద్ధిలో కేంద్ర గిడ్డంగుల సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ స్పందన అన్నారు. గర్రెపల్లిలోని సిడబ్ల్యుసి గోదాములలో ఆదివారం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను హతమారుస్తుందని, ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని పౌర హక్కుల రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో డిఫెన్స్ ఫోర్స్ నాయకులు సీపెల్లి రాజేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభా స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు కృషి చేశారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు స్పష్టం చేశారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని శ్రీపాద చౌరస్తా, ఆర్సీ కట్టలోని శ్రీపాదరావు విగ్రహాలకు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సుల్తానాబాద్ పట్టణంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పునాదులకే పరిమతమైన ఈ పనులు గురించి పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. దీంతో మార్కెట్ నిర్మాణానికి వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి.
మహిళా సంఘాల పనితీరు మెరుగుపరిచేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శని వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాలపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ లింకేజ్ నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 90 శాతం మేర రుణాలు పంపిణీ పూర్తి చేశారని, మిగి తా రుణాల పంపిణీ ఈనెల 15 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటుకు శనివారం నోడల్ అధికారి, సుల్తానాబాద్ సివిల్ కోర్టు జడ్జి గణేష్ సందర్శించారు. ప్రతిపాదనలో ఉన్న ముంజాల మధు, పచ్చిమట్ల సునీల్, ఇరుకుల్ల సత్యనారాయణకు చెందిన భవనాల్లో మౌలిక సౌకర్యాలను పరిశీలించారు.
విద్యార్థులకు న్యాయసేవలు, చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయమూర్తి టి.శ్రీనివాస్రావు అన్నారు. మండల న్యా యసేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వ హించారు.
ఆర్జీ-1లో ఫిబ్రవరిలో 110శాతం ఉత్పత్తి సాధించినట్టు ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాని గాను 4.22 లక్షల టన్నులు సాధించామని తెలిపారు. ఉద్యోగులు, అధికారులు కలిసి కట్టుగా రక్షణతో పని చేసి ఉత్పత్తి సాధించినందునకు జీఎం అభినందిం చారు.
వేవవిలో సింగరేణి ప్రాంతంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు గోదావరి మాత్రమే మార్గంగా ఉండడం, గోదావరినది ఎండిపోయిన పరిస్థితుల్లో గనుల నీటిని వాడుకోవాలని యాజమాన్యం భావించింది.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగిందని కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం జెడ్పీ హై స్కూల్, గోదావరిఖని సెక్రర్డ్ హార్ట్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.