Home » Stock Market
దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కోటిశ్వరులు కావాలని ఆశిస్తారు. ఆ క్రమంలోనే తక్కువ పెట్టుబడి(Investment)తో ఎక్కువ లాభాలు రావాలని చూస్తారు. ఇందుకోసం అనేక రకాల పెట్టుబడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే మీరు ప్రతి నెల ప్రణాళికబద్దమైన సేవింగ్ ప్లాన్(saving plan) అలవాటు చేసుకుంటే కోటి రూపాయలకు పైగా సంపాదించవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) వరుసగా రెండో రోజు(మే 17న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73917 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22466 పాయింట్ల వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు వృద్ది చెంది 48,116 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 452 పాయింట్లు పెరిగి 51,605 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) గురువారం (మే 16న) భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ తర్వాత గురువారం దేశీయ మార్కెట్లలో బలమైన ప్రారంభం మొదలై, సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో ముగిశాయి.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు(investors) శుభవార్త వచ్చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(SEBI) మ్యూచువల్ ఫండ్ KYC నిబంధనలల్లో ఇటీవల మార్పులు చేసింది. దీంతో కోటి మందికి పైగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టం నుంచి సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పుంజుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లోకి పయనించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, ఎన్నికల నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వారంలో తొలి రోజు అయిన సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం తీవ్ర అనిశ్చితిలో కదలాడాయి.
ఐపీఓల(IPOs) వారం మళ్లీ వచ్చేసింది. దేశంలో లోక్సభ ఎన్నికల(loksabha election 2024) నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ ఈనెలలో అస్థిరతను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం రానున్న ఐపీఓల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1000 పాయింట్లకు పైగా నష్టపోయి మదుపర్లకు నష్టాలను మిగిల్చిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఉపశమనం కలిగించింది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లో పయనించాయి
దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock market) గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 10) దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఫ్లాట్గా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 72,525 వద్ద మొదలుకాగా, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,009 వద్ద ప్రారంభమైంది.
లోక్సభ ఎన్నికలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మదుపర్లు ఆచూతూచి అడుగులేస్తున్నారు. దీంతో బుధవారం కూడా దేశీయ సూచీలు రోజంతా ఒడిదుడుకుల మధ్యనే సాగాయి.