Share News

Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..నిన్నటి నష్టాలకు బ్రేక్ పడుతుందా..

ABN , Publish Date - Apr 08 , 2025 | 10:50 AM

భారత స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ రోజు మార్కెట్లు పాజిటివ్ ధోరణుల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1200, నిఫ్టీ 400 పాయింట్లకుపైగా లాభపడ్డాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..నిన్నటి నష్టాలకు బ్రేక్ పడుతుందా..
Sensex Opens 1200 Points Gain

ట్రంప్ టారిఫ్ టెర్రర్ కారణంగా వరుసగా మూడు రోజులుగా క్షీణతను చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఇప్పుడు కోలుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నేడు (ఏప్రిల్ 8న) భారత స్టాక్ మార్కెట్లు (Stock market) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతో ట్రేడైంది. అదే సమయంలో నిఫ్టీ కూడా 400 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 800 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 కూడా 1000 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ క్రమంలో మార్కెట్లో ఎక్కడ చూసినా కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. నిఫ్టీలోని యాభై స్టాక్స్ అన్నీ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమై దూసుకెళ్తున్నాయి. దీంతో అనేక మంది మదుపర్లు లాభపడుతున్నారు.


టాప్ 5 స్టాక్స్

ఈ క్రమంలో ప్రస్తుతం శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఐచర్ మోటార్స్, గ్రాసిమ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, M&M, టాటా స్టీల్, హిందాల్కో, ట్రెంట్ సంస్థల స్టాక్స్ మత్రం టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ కదలికలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం నిర్ణయాలు, ఇండియా ఇంక్ నుంచి నాల్గో త్రైమాసిక ఫలితాలు వంటి కీలక అంశాలు పెట్టుబడిదారులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. అంతేకాక, ఈ వారం చివరిలో విడుదలయ్యే స్థూల ఆర్థిక గణాంకాలపై కూడా మార్కెట్లు క్రమంగా దృష్టి పెట్టాయి.


ఇన్వెస్టర్లకు సూచన

ఈ క్రమంలో నిఫ్టీ 50కి సంబంధించి తాజా అంచనాలను కోటక్ సెక్యూరిటీస్‌లో ఈక్విటీ రీసెర్చ్ అధిపతి శ్రీకాంత్ చౌహాన్ వెల్లడించారు. ఆయన ప్రకారం, 22,000 స్థాయిలపై మార్కెట్‌లో నిఘా ఉంచడం చాలా ముఖ్యమన్నారు. నిఫ్టీ 22,000 స్థాయిల కంటే తక్కువగా ఉండటం, అదనపు బలహీనతకు దారితీయవచ్చన్నారు. కానీ, 22,500, 22,800 వద్ద ప్రతిఘటన ఉంటే, కొంత పుల్ బ్యాక్ చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. మరింతగా 22,000 కంటే తక్కువ స్థాయిలకు నిఫ్టీ పడితే, అది క్రమంగా 21,700 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.


ఈరోజు కూడా ట్రంప్ అదే దూకుడు

సోమవారం నిఫ్టీ 30, BSE సెన్సెక్స్ వరుసగా 3.2%, 3% పడిపోయాయి. MSCI ఆసియా మాజీ జపాన్ ఇండెక్స్‌లో 8.4% క్షీణించింది. అంతేకాదు ఈరోజు కూడా మళ్లీ చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరింత రాజుకుంది. చైనా ప్రతీకార సుంకాల తర్వాత, ట్రంప్ అదనంగా 50 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు. ఈ కారణంగా, చైనాపై మొత్తం సుంకం 104 శాతానికి పెరుగుతుంది.

ఈ క్రమంలో ముడి చమురు 2% తగ్గి 4 సంవత్సరాల కనిష్ట స్థాయి $65 కంటే దిగువకు చేరుకుంది. ఇది గత మూడు రోజుల్లో 14% తగ్గిది. దేశీయ మార్కెట్లో బంగారం రూ.1100 తగ్గి రూ.87000 వద్ద ముగిసింది, వెండి రూ.1100 పెరిగి రూ.88500 పైన ముగిసింది. 10 సంవత్సరాల US బాండ్ దిగుబడి 30 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 6 నెలల కనిష్ట స్థాయి నుంచి దాదాపు 4.2%కి చేరుకుంది, డాలర్ ఇండెక్స్ కూడా 103పైన కోలుకుంది.


ఇవి కూడా చదవండి:

Mudra Scheme: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముద్రా స్కీం..బిజినెస్ కోసం రూ. 20 లక్షల వరకు ఈజీ రుణాలు


iPhone Prices: ట్రంప్ టారిఫ్ ప్రభావం..ఇకపై రూ.2 లక్షలకు ఐఫోన్ ధరలు..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 08 , 2025 | 11:06 AM