Stock Market: అసలు స్టాక్ మార్కెట్ నష్టాలు ఎందుకు..ఇవే కారణాలు
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:00 PM
ఈరోజు స్టాక్ మార్కెట్ దారుణంగా క్రాష్ అయ్యింది. సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. అయితే ఎందుకు నష్టాలు పెరిగాయి. ఏ రంగాలు సేఫ్ అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నేడు (ఏప్రిల్ 7న, 2025) సోమవారం భారత స్టాక్ మార్కెట్(Stock Market) సహా ఆసియా దేశాల్లో కూడా సూచీలు మొత్తం నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా, భారత స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే తీవ్రమైన అమ్మకాలు పెరిగి, నిఫ్టీ, సెన్సెక్స్ 10 నెలల కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. మరోవైపు టోక్యో నిక్కీ 225 ఇండెక్స్ 8 శాతం తగ్గిపోగా, ఆస్ట్రేలియా S&P/ASX 200 6% పడిపోయింది. తైవాన్ సూచీలు కూడా 6 శాతం, దక్షిణ కొరియాలోని కోస్పి 4.4% నష్టపోయింది. ఇండియా VIX (వోలాటిలిటీ ఇండెక్స్) 55%కి చేరుకుంది. ఇది పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది.
ప్రధాన కారణాలు
ప్రముఖ ఫైనాన్స్ సంస్థ గోల్డ్మన్ సాచ్స్.. ట్రంప్ టారిఫ్ విధించిన తర్వాత అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలను 45%కు పెంచింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని తెలిపింది. దీంతో భయాందోళన చెందిన మదుపర్లు అమ్మకాలు చేశారు. తద్వారా, నిఫ్టీ, సెన్సెక్స్, వృద్ధి, అమ్మకాల ఒత్తిడితో అనేక మార్కెట్లలో నష్టాలు ఏర్పడ్డాయి. ట్రంప్ టారిఫ్ విధించిన చర్యల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరిగిన అనిశ్చితి, ద్రవ్యోల్బణం, అమెరికా, చైనా వాణిజ్య విభేదాలు, వృద్ధి తగ్గిపోవడం సహా పలు కారణాలు ఈ నష్టాలకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
వేచి ఉండాలి..
ప్రపంచ మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి కారణంగానే మార్కెట్లు పడిపోయాయని ICICI సెక్యూరిటీస్ విశ్లేషకులు అన్నారు. ఈ క్రమంలో నిఫ్టీ సూచిక 22,800 పాయింట్ల స్థాయికి చేరే వరకు పెట్టుబడులను వేచి ఉంచాలని ఇన్వెస్టర్లకు సూచించారు. దీంతోపాటు పలు అనిశ్చితాల మధ్య, 22,000 పాయింట్ల దగ్గర సపోర్ట్ లభించవచ్చన్నారు. అయితే, ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు క్షీణంగా ఉంటే, వీటిలో పెట్టుబడులు పెట్టడం మిగిలిన రిస్క్ను పరిగణనలోకి తీసుకోవడం కూడా కీలకం కానుంది.
సర్వీసెస్ సూచనలు
ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన భయాందోళన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన పెట్టుబడి వ్యూహకర్త వి.కె. విజయకుమార్ అన్నారు. ఈ క్రమంలో వాణిజ్య యుద్ధం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో మరో సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. వాణిజ్య ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని తర్వాత భారతదేశం వృద్ధి దిశగా కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏ రంగాలు పెట్టుబడులకు అనుకూలం
ఈ మార్కెట్ భయాందోళన నేపథ్యంలో సందర్భంలో దేశీయ వినియోగ రంగాలు, ఆర్థిక, విమానయాన, హోటల్స్, ఆటోలు, సిమెంట్, రక్షణ రంగాలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వంటి రంగాలు సంక్షోభం నుంచి సురక్షితంగా ఉండే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సుంకాలు ఎక్కువకాలం కొనసాగవని భావించినప్పటికీ, ఈ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ వల్ల పెట్టుబడిదారులకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్..నిమిషాల్లోనే లక్షల కోట్ల నష్టం
YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియేషన్స్ మరింత ఈజీ
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్లో పర్సనల్ లోన్స్పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News