Home » Student
రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా పలు పీజీ కోర్సుల ప్రారంభానికి జాతీయ వైద్య మండలి అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు శుక్రవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు పంపింది.
నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్పై ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు శుక్రవారం దాడి చేశారు. అదే పాఠశాల హాస్టల్లో ఉంటున్న తమ చిన్నారులపై ఆయన కొన్నాళ్లుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆయనపై ఈ తరహా ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆంజనేయులు గౌడ్ వయసు 77 ఏళ్లు. విద్యాసంస్థల నిర్వహణతోపాటు సాహితీ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన నగరవాసులకు సుపరిచితులు. ఆయనపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న టూటౌన పోలీసులు వెంటనే పాఠశాలకు వెళ్లారు. నాలుగు, ఐదో ...
రాష్ట్రంలో వైద్య విద్య మరింత మందికి చేరువ కానుంది. తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతులిచ్చింది. ఇందుకు సంబంధించి ఎల్వోపీ(లెటర్ ఆఫ్ పర్మిషన్)ను బుధవారం రాత్రి జారీ చేసింది.
మలేషియాలో ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ యూత్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు తెలంగాణ గురుకుల విద్యార్థిని ఎంపికయింది.
రాష్ట్రంలో నిరుద్యోగితను తగ్గించడం, ప్రైవేటులో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముచ్చెర్లలో రాష్ట్ర సర్కారు ఏర్పాటుచేస్తున్న ‘యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ’లో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు నిర్వహించనున్నారు! తొలి ఏడాది ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడతారు.
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఈసారీ కంప్యూటర్స్ అనుబంధ కోర్సుల్లో హవా కొనసాగింది. కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ.. విభాగాల్లో సీట్లు దాదాపు పూర్తయ్యాయి.
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అర్చిత(Archita) ఆత్మహత్య ఘటనపై విచారణకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు. బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల లేమిపై అవినాశ్ దూబే అనే విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. ‘
సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి.
విరుద్ధంగా లైబ్రరీ ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులు అంతా ప్రిపేర్ అవుతున్నారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చింది. దాంతో చాలా మంది విద్యార్థులు పైకి వచ్చారు. తానియా సోని, శ్రేయ యాదవ్, నెవిన్ డాల్విన్ మాత్రం వరదనీటిలో చిక్కుకొని చనిపోయారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు.