Home » Student
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎనిమిది వైద్య కళాశాలల అనుమతులకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్వోపీ) ఇవ్వలేదు. అనుమతులపై జాతీయ వైద్య కమిషన్ తాజాగా కొత్త కాలేజీల ప్రిన్సిపల్స్కు మెయిల్ పంపింది.
తాత్కాలిక సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ను కల్పిస్తున్నారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే.
చేతిలో భోజనం ప్లేట్లు పట్టుకుని వెళుతున్న వీరు బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. గ్రామంలో ఉన్న పాఠశాలలో గదుల కొరత ఉంది. దీంతో ఉన్నత పాఠశాల భవనాన్ని ఊరికి దూరంగా నిర్మిస్తున్నారు. పనులు పూర్తి కాకనే.. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను అక్కడికి తరలించి.. పాఠాలు చెబుతున్నారు. కానీ మధ్యాహ్న భోజనం మాత్రం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే పెడుతున్నారు. దీంతో రోజూ ఇలా కి.మీ. దూరం తట్టలు ఎత్తుకుని ...
ఇండోర్లో ఓ బస్సులో విద్యార్థి ప్రయాణిస్తున్నాడు. అతనితో అమ్మాయి ఉంది. టికెట్ అని అడగగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తమ వద్ద పాస్ ఉన్నాయని విద్యార్థి చెప్పాడట.. ఆ కండక్టర్కు సరిగా వినపడలేదు అనుకుంట. అదే విషయంపై మరి మరి అడగటం.. స్పందించడం లేదని కండక్టర్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తంగా 173 ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చారు. ఈ కాలేజీల్లో 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ప్రిలిమ్స్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేసినట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు.
బాలికల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నెలసరి సమయంలో ఇచ్చే శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ ఏడాది కాలంగా నిలిచిపోయింది. వాస్తవానికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీటిని కొనుగోలు చేసి విద్యాశాఖకు పంపితే, అక్కడి అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థినులకు అందించేవారు.
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపర్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎ్సఈ), సీఎ్సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.