Home » Union Budget
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్పై రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కేంద్ర బడ్జెట్ విపక్షాపూరితంగా ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. విపక్షాలు 'దారుణమైన ఆరోపణలు' చేస్తున్నాయని విరుచుకుపడ్డారు.
కేంద్రపభుత్వం రూ.48,20,512 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రైతులు, యువత, మహిళలు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రూపొందించింది.
రేవంత్ రెడ్డి సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న చర్చపై కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
తెలంగాణలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. కేంద్రబడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడంపై జరిగని చర్చలో భాగంగా రేవంత్, కేటీఆర్ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. దిశానిర్దేశం లేని, ప్రజావ్యతిరేక, రాజకీయ పక్షపాత బడ్జెట్ అని అభివర్ణించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోకసభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఇది 'కాపీ-పేస్ట్' బడ్జెట్ అని అభివర్ణించింది.
Andhrapradesh: కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాలు అందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. రూ.15 వేల కోట్లు అమరావతికి ఇవ్వడానికి బడ్జెట్లో పెట్టారన్నారు. పోలవరం నివేదికలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని చెప్పారని.. దీనికి కేంద్రం మద్దతు ఇస్తామని కూడా చెప్పారన్నారు.
Andhrapradesh: ఏపీ చరిత్రలో చాలా శుభదినమని ఎమ్యెల్యే సుజన చౌదరి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అరాచక ఆటవిక పాలనలో రాష్ట్రం ఏమైందో చూశామన్నారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. చట్టం ప్రకారం రావలసిన వాటినే తెచ్చుకోనే స్తోమత లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.