Home » West Godavari
Andhrapradesh: పశ్చిమగోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
Andhrapradesh: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన డెడ్ బాడీ పార్శిల్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడికి భావిస్తున్న శ్రీధర్ వర్మకు ఏకంగా మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర వర్మకు రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ‘పార్శిల్లో మృతదేహం డెలివరీ’ మిస్టరీ వీడుతోంది. ప్రధాన సూత్రధారి తులసి మరిది సిద్ధార్థ వర్మే అని భావిస్తున్నారు.
‘మీరు అడిగిన విధంగా మీ ఇంటి నిర్మాణానికి ఇప్పటికే టైల్స్, పెయింటింగ్ డబ్బాలు పంపించాం. మరి కొంత ఇంటి సామగ్రిని పంపిస్తున్నాం’ అంటూ ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పార్సిల్ను స్థానికులు తీవ్ర భయాందోళలనకు గురి అయ్యారు. సాధారణంగా పార్సిల్లో ఏమైనా వస్తువులు వస్తుంటాయి. కానీ యoడగండిలో వచ్చిన పార్సిల్లో మాత్రం వ్యక్తి మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది.
2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళుతున్నారు.
ప.గో. జిల్లా: మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం పాలకొల్లు సేవ్ గర్ల్ చైల్ఢ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు హాజరయ్యారు.
జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు.. 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే, చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తం ప్రభుత్వ విధానాల ఫలితంగా చేపల మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఓ పక్క అధిక విద్యుత్ ధరల భారం ఇతర ఖర్చులు పెరగడంతో పాటు మార్కెట్ ట్రేడర్లు చేపల ధరలు తగించి కొనుగోలు చేసేవారు.