యాసంగిలో ప్రాజెక్టులు, చెరువుల కింద సాగు చేసే పంటలకు నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు పేర్కొంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు.
జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి తీరం శివ నామస్మరణతో, శివసత్తుల పూనకాల నడుమ పులకించిపోయింది. వేకువజాము నుంచే ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాల గట్టు మల్లన్న జాతర, బెల్లంపల్లి మండలం బుగ్గ రాజరాజేశ్వరస్వామి, కత్తెరసాలలోని మల్లికార్జునస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దండేపల్లి మండలం ద్వారకలో దతత్రేయ, శివాలయం, నర్సాపూర్లో శ్రీబ్రమరాంభ సమేత దేవాలయం, మేదరిపేటలో శ్రీకాశీవిశ్వేరశ్వర, లక్ష్మీనారాయణస్వామి దేవాలయం, దండేపల్లి పద్మశాలి సంఘం భవనం లో భక్త మార్కండేయస్వామి ఆలయంలో బుధవారం రాత్రి శివపార్వతుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభోపేతంగా జరిగాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి ఎన్నిక సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం వేలాల జాతర ప్రారంభమై మూడురోజులపాటు జరగనుంది. శి
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్తర వాహిని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిం చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి సూ చించారు. మంగళవారం చెన్నూరులోని గోదా వరి తీరాన్ని పరిశీలించారు.
రామగుండం పోలీసు కమిషనరేట్లో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది.
ఏటా వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కడో ఓ చోట అగ్గి రాజుకుని అడవిలోని చెట్లకు మంటలు అంటుకుంటాయి. కార్చిచ్చురేగి విలువైన వృక్షాలు, జంతువులు ఆహుతవుతుంటాయి. ఆకురాలే కాలం ప్రారంభం కాగానే పొరపాటున అగ్గిరవ్వలు పడి అంతులేని నష్టం జరుగుతుంది.