Share News

Nadendla Manohar: రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడుతాం

ABN , First Publish Date - 2023-10-16T13:40:23+05:30 IST

కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని నసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు.

Nadendla Manohar:  రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడుతాం

గుంటూరు: కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Janasena Leader Nadendla Manohar) వ్యాఖ్యలు చేశారు. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంకు పరిపాలనపై అవగాహన లేదన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు కుదేలైపోయాయని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు సీఎం జగన్ (CM Jagan) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైజాగ్ ఎందుకు వెళ్ళాలో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ఆరు లక్షల మంది నిరుద్యోగులు, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడుతామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Updated Date - 2023-10-16T13:40:23+05:30 IST