Anurag Kashyap: సుశాంత్‌తో ఆ విధంగా చేసినందుకు బాధపడుతున్నాను

ABN , First Publish Date - 2023-01-29T15:39:24+05:30 IST

వైవిధ్య చిత్రాలతో బాలీవుడ్‌లో ఫేమ్‌ను సంపాదించుకున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap). ‘దేవ్ డీ’, ‘రమణ్ రాఘవ్ 2. 0’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు.

Anurag Kashyap: సుశాంత్‌తో ఆ విధంగా చేసినందుకు బాధపడుతున్నాను

వైవిధ్య చిత్రాలతో బాలీవుడ్‌లో ఫేమ్‌ను సంపాదించుకున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap). ‘దేవ్ డీ’, ‘రమణ్ రాఘవ్ 2. 0’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. అనురాగ్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ (Sushant Singh Rajput) చనిపోవడానికి ముందు సినిమా చేయాలని తనను సంప్రదించాడని పేర్కొన్నాడు. అయినప్పటికీ, తాను స్పందించలేదని వెల్లడించాడు. సుశాంత్‌తో మాట్లాడనందుకు ఇప్పటికీ తాను బాధపడుతున్నట్టు తెలిపాడు. ఇవన్నీ తెలుసుకోవడానికి తనకు దాదాపుగా ఏడాదిన్నర సమయం పట్టిందని చెప్పాడు.

‘‘సుశాంత్ చనిపోవడానికి సరిగ్గా మూడు వారాల ముందు అతడి టీమ్ నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చింది. సుశాంత్ నన్ను కలవాలనుకుంటున్నాడని, మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు. కానీ, నేను అతడితో మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. ఇటీవల అభయ్‌ డియోల్‌తో విభేదాల గురించి బహిరంగంగా మాట్లాడినప్పుడు నా మాటల వల్ల అతడు బాధపడుతున్నాడని తెలిసింది. ఫలితంగా అభయ్‌ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పాను’’ అని అనురాగ్‌ కశ్యప్‌ స్పష్టం చేశాడు.

అనురాగ్ కశ్యప్ నిర్మించిన ‘హస్సి తో ఫస్సీ’ చిత్రంలో మొదటగా టైటిల్ రోల్‌కు సుశాంత్‌సింగ్ రాజ్‌ఫుత్ ఎంపికయ్యాడు. అనంతరం మరో సినిమాలో అవకాశం రావడంతో ‘హస్సి తో ఫస్సీ’ నుంచి తప్పుకొన్నాడు. ఫలితంగా అనురాగ్ కశ్యప్, సుశాంత్ మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం సుశాంత్ మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ అనురాగ్ మాత్రం ఆసక్తి చూపించలేదు.

Updated Date - 2023-01-29T15:42:14+05:30 IST