Bride: వరుడి ఇంటికి చేరిన వధువు.. కాబోయే భర్తను మొదటిసారి చూసిన ఆమెకు షాక్.. పెళ్లిని ఎలాగైనా ఆపాలని పక్కా స్కెచ్..!

ABN , First Publish Date - 2023-09-27T17:05:23+05:30 IST

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కట్నకానుకల విషయంలో చివరి నిముషంలో పెళ్లిని రద్దు చేసుకోవడం, భోజనాల వద్ద గొడవలు జరిగి చివరకు వివాహాలు ఆగిపోవడం, వరుడు తన మొఖానికి కేక్ పూశాడనే కోపంతో పెళ్లిని...

Bride: వరుడి ఇంటికి చేరిన వధువు.. కాబోయే భర్తను మొదటిసారి చూసిన ఆమెకు షాక్.. పెళ్లిని ఎలాగైనా ఆపాలని పక్కా స్కెచ్..!
ప్రతీకాత్మక చిత్రం

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కట్నకానుకల విషయంలో చివరి నిముషంలో పెళ్లిని రద్దు చేసుకోవడం, భోజనాల వద్ద గొడవలు జరిగి చివరకు వివాహాలు ఆగిపోవడం, వరుడు తన మొఖానికి కేక్ పూశాడనే కోపంతో పెళ్లిని రద్దు చేసుకోవడం వంటి ఘటనలు చాలా చూశాం. తాజాగా, జైపూర్‌లో ఇలాంటి విచిత్ర ఘటనకు సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. కొద్ది గంటల్లో పెళ్లనగా వధువు కనిపించకుండాపోయింది. అంతా ప్రియుడితో వెళ్లిపోయి ఉంటుందని అనుకున్నారు. అయితే చివరకు పోలీసుల ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

జైపూర్‌లో (Jaipur) కర్దాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక భట్టా బస్తీ ప్రాంతానికి చెందిన 20ఏళ్ల యువతికి (young woman) ఇదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం (marriage) నిశ్చయమైంది. సెప్టెంబర్ 26న వివాహం జరగాల్సి ఉంది. దీంతో రెండు కుటుంబాల వారూ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వధువు (bride) కుటుంబ సభ్యులు కూడా తమ బంధువులు, సన్నిహితులకు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో పెళ్లికి రెండు రోజుల ముందు వధువును తండ్రి.. వరుడి ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి ఊహించని ఘటన చోటు చేసుకుంది. అయితే అప్పటిదాకా ఆమె వరుడిని (groom) చూడలేదు.

Train Accident: ప్లాట్‌ఫామ్ మీదకే దూసుకొచ్చిన రైలు.. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు..

మొదటిసారి వరుడిని చూడగానే ఆమెకు అసలు నచ్చలేదు. ఎలాగైనా పెళ్లి తప్పించాలనే ఉద్దేశంతో అదే రోజు రాత్రి తన స్నేహితుడికి ఫోన్ చేసి, ఊరి బయటకు రమ్మని చెప్పింది. అక్కడికి వెళ్లిన తర్వాత అతడికి విషయం తెలియజేసింది. అతను నచ్చజెప్పాలని చూసినా వినిపించుకోలేదు. దీంతో చివరకు చేసేదేమీలేక ఆమెను బైకులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. వధువుకు ఫోన్ చేయగా అందుబాటులో లేదు. అయితే మరుసటి రోజు ఆమె ఫోన్ ఆన్ చేయడంతో లోకేషన్ గుర్తించారు. చివరకు ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి విచారించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, పెళ్లంటే ఇష్టం లేకే వెళ్లిపోయానని యువతి తెలిపింది. విచారణ అనంతరం ఇద్దరినీ పంపించేశారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Stomach Operation: 3 గంటల పాటు ఆపరేషన్.. 40 ఏళ్ల వ్యక్తి కడుపులోంచి డాక్టర్లు బయటకు తీసిన వస్తువులివే..!

Updated Date - 2023-09-27T17:05:23+05:30 IST