Share News

లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలి

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:37 PM

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని పార్టీ అధిష్టానం అందించిన లక్ష్యానికి మించి చేయాలని పీలేరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

పీలేరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని పార్టీ అధిష్టానం అందించిన లక్ష్యానికి మించి చేయాలని పీలేరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి జరగనున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ సన్నాహకంగా సోమవారం ఆయన పార్టీ కార్యాల యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పీలేరు నియోజకవర్గంలో కుప్పంతో పోటీపడేలా సభ్యత్వ నమోదు చేయిం చామని, అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ స్ఫూర్తిని కొనసా గించాలని కోరారు. రూ.100లు చెల్లించి సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉంటుందన్నారు. అనంతరం సభ్యత్వ నమోదుపై మండలాల వారీగా సమీక్షించారు. నాయకులు శ్రీకాంత రెడ్డి, అమరనాథరెడ్డి, కోటపల్లె బాబు రెడ్డి, మల్లెల రెడ్డిబాషా, పురం రామ్మూర్తి, యల్లెల రెడ్డప్ప రెడ్డి, కంచి సూరి, రహంతుల్లా, వసంతాల రాజా, మల్లిఖార్జున రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:37 PM