ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Buddha Venkanna: ఆ విషయం డైవర్ట్ చేసేందుకు విజయసాయిరెడ్డి ట్వీట్లు: బుద్దా వెంకన్న..

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:35 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతలను 151స్థానాల నుంచి 11సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వారికి సిగ్గు రావడం లేదని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డితోపాటు దేవినేని అవినాశ్, కొడాలి నాని, పేర్ని నాని వంటి నేతల్ని ఏ పార్టీలో చేర్చుకోరని ఆయన ఎద్దేవా చేశారు.

విజయవాడ: తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి వరస ట్వీట్లు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గుంట నక్కలా వ్యవహరిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ట్విటర్ వేదికగా మెురుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ వైఖరి, నియంతృత్వ పోకడలు భరించలేక ఆ పార్టీని నేతలు వీడుతున్నారని వెంకన్న ఎద్దేవా చేశారు. ట్విటర్‌లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎందుకు పోస్టులు పెడుతున్నావో అందరికీ తెలుసంటూ విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.


అందుకే రూ.350కోట్లు..

ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.."తప్పుడు లెక్కలు రాసినందుకు నువ్వు(విజయసాయిరెడ్డి) 16నెలలపాటు జైలులో ఉన్నావు. అలాంటి నువ్వు మాకు నీతులు చెబుతావా?. వైసీపీ అధినేత జగన్‌కు జైలులో రూమ్ మేట్‌వి. అందుకే నీకు రాజ్యసభ సీటు ఇచ్చారు. శాంతి నివాసంలో కూర్చుని ట్విటర్‌లో పోస్టులు పెట్టడం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలి. వరద విపత్తుకు స్పందించి రూ.350కోట్లు సిఎం రిలీఫ్ పండ్‌కు విరాళాలు వచ్చాయి. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో పారిశ్రామిక వేత్తలు పెద్దఎత్తున ముందుకు వచ్చారు. జగన్ అధికారంలో ఉంటే మిమ్మల్ని నమ్మి ఎవరైనా రూపాయైనా ఇచ్చేవాళ్లా? మీరు దొంగలు కాదు.. గజ దొంగలు. అందుకే ఎవరూ నమ్మడం లేదు.


జగన్‌కు బోడి గుండు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని 151స్థానాల నుంచి 11సీట్లకు ప్రజలు పరిమితం చేసినా సిగ్గు రావడం లేదు. నీతోపాటు దేవినేని అవినాశ్, కొడాలి నాని, పేర్ని నాని వంటి నేతల్ని ఏ పార్టీ చేర్చుకోదు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేసే ముందు, ఆ తర్వాత టీడీపీకి ఎంత గ్రాఫ్ పెరిగిందో తెలుసుకో. టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేశ్ నాయకత్వంలో పని చేసేందుకు క్యాడర్ సిద్ధంగా ఉంది. నీతోపాటు మీ పార్టీ అధినేత జగన్, మరికొంతమంది వైసీపీ నేతలు త్వరలో జైలుకు వెళ్తారు. లోకేశ్ సీనియర్లపై గుర్రుగా ఉన్నారని ఎవరైనా నీకొచ్చి చెప్పారా?. నువ్వు గుంట నక్కవి.. నీకు లోకేశ్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. అవినీతికి ఆమడ దూరంలో ఉండే వ్యక్తి లోకేశ్. ఎక్కడైనా అవినీతి చేసి దోచుకునే వ్యక్తి జగన్. ఆ 11స్థానాలూ ఇవ్వకుండా ఉండాల్సిందని ఇప్పుడు ఏపీ ప్రజలు భావిస్తున్నారు. క్షవరం అయితే గానీ వివరం రాదని పెద్దలు చెప్పినట్లు.. ప్రజలు జగన్‌కు బోడి గుండు కొట్టారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యకు, మీడియా ముందుకు రాని జగన్ ఇప్పుడు వస్తున్నారు.


చిప్పుకూడుకు సిద్ధంగా ఉండు..

వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి నడిచినప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారు. అలాంటి సీనియర్లు జగన్‌ను ఛీ కొట్టి బయటకు వెళ్లిపోతున్నా.. మీకు మాత్రం సిగ్గు రావడం లేదు. ఏపీలో వైసీపీ కథ ముగిసింది. 11మంది ఎమ్మెల్యేల్లో 10మంది టీడీపీ వైపు చూస్తున్నారు. విజయసాయిరెడ్డి.. నీకు సవాల్ చేస్తున్నా. ట్వీట్లు కాదు.. దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి బహిరంగ చర్చకు రా. మీరు చేసిన దాడులు, దారుణాలపై జైలుకు వెళ్లేందుకు సమయం దగ్గర పడింది. త్వరలోనే జైలులో మళ్లీ చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండండి. ఇంకోసారి గుంటనక్క వేషాలు వేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతాం" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

YS Jagan: అంతా కల్తీ.. ఐదేళ్లు మాటలతో మాయ..

Rahul Gandhi: ప్రతీ భక్తుడిని బాధపెడుతోంది.. క్షుణ్ణంగా పరిశీలించాలి

Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..

Updated Date - Sep 21 , 2024 | 11:43 AM