ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Devineni Uma: జగన్ మానసిక స్థితి బాలేదు.. దేవినేని ఉమా వ్యంగ్యాస్త్రాలు

ABN, Publish Date - Jul 06 , 2024 | 09:10 PM

సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) తెలిపారు. వైఎస్ జగన్ రెడ్డి పులివెందులలో పెడబొబ్బలు పెడుతున్నాడని విమర్శించారు.

Devineni Uma

ఎన్టీఆర్ జిల్లా (గొల్లపూడి) : సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) తెలిపారు. వైఎస్ జగన్ రెడ్డి పులివెందులలో పెడబొబ్బలు పెడుతున్నాడన్నారు. నెల్లూరులో పరామర్శకు వెళ్లి పిన్నెల్లి మంచోడు ఈవీఎంలు పగలగొడితే తప్పేంటని అంటున్నాడని.. దీనిని బట్టి చూస్తే ఆయనకున్న పరిజ్ఞానం, మానసిక పరిస్థితి అద్దంపట్టెలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ రెడ్డి డొల్లతనం బయటపడిందని విమర్శించారు. దశాబ్దంపైగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రజల సమస్యలు, పునర్విభన చట్టంలోని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశాలు జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. శిశుపాలుడిలా వైసీపీ నూరుతప్పులు చేయబట్టే ప్రజలు ఓటు అనే ఆయుధంతో శిరచ్ఛేధం చేశారన్నారు. ఎవరికి హెచ్చరికలు చేస్తున్నావ్ ? తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని పరదాలు కట్టుకొని లక్షలకోట్ల దోపిడి చేశావని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులైంది జగన్ ప్రజల తిరస్కారానికి గురయ్యారు. అప్పుడే పిల్లి శాపనార్థాలు, ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారని సెటైర్లు గుప్పించారు.


పులివెందులపై కక్ష పెంచుకున్నారు..

‘‘పులివెందులలో ప్రజాస్వామ్యం వర్థిల్లిందంటున్నాడు దశాబ్ధాలుగా అక్కడ మీకు ఓటు వేయలేదనే కక్షతో చీనిచెట్లు కొట్టేశారు. అక్కడ పోటీ చేసిన అభ్యర్థిని ఎన్ కౌంటర్ చేస్తానని కొండల్లో, గుట్టల్లో తిప్పింది అప్పుడే మర్చిపోయావా జగన్ రెడ్డి ? మీ కుటుంబ సభ్యులనే పులివెందులలో ఒక రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అడిగిన ప్రశ్న మీ ప్రభుత్వాన్ని కూలదోసింది. వైసీపీ అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలు మీకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. ఐదేళ్లు జగన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పాపాన పోలేదు. బయట ప్రపంచానికి తెలియకుండా పక్క రాష్ట్రంతో బిర్యానీ మీటింగులు పెట్టుకున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నారు. ఏదో లైవ్ కావాలంట ఏమి లైవ్ కావాలో ఆయనకు. రాష్ట్రంలో ఐదేళ్లు మీరు చేసిన పాపాలు, అవినీతి బట్టబయలవుతుంది. నీ సోకాలు ఆపు జగన్ రెడ్డి నీ మానసిక పరిస్థితి సరిగా లేదు. మందులు సమయానికి వేసుకోండి’’ అని దేవినేని ఉమా తెలిపారు.

Updated Date - Jul 06 , 2024 | 10:00 PM

Advertising
Advertising
<