Share News

జయశంకర్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీలో పీజీ

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:27 AM

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎ్‌సఏయూ)- పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌(రాజేంద్రనగర్‌, సైఫాబాద్‌), జగిత్యాల, సంగారెడ్డి(కంది) వ్యవసాయ కళాశాలల్లో...

జయశంకర్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీలో  పీజీ

జయశంకర్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీలో పీజీ

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎ్‌సఏయూ)- పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌(రాజేంద్రనగర్‌, సైఫాబాద్‌), జగిత్యాల, సంగారెడ్డి(కంది) వ్యవసాయ కళాశాలల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ప్రతి స్పెషలైజేషన్‌లో 10 శాతం సీట్లను అదనంగా కేటాయించారు.


స్పెషలైజేషన్‌లు-సీట్లు

  • ఎమ్మెస్సీ(అగ్రికల్చర్‌): మొత్తం 125 సీట్లు ఉన్నాయి. వీటిలో నాలుగింటిని దివ్యాంగులకు ప్రత్యేకించారు. రాజేంద్రనగర్‌ క్యాంప ్‌సలో అగ్రానమీ 22, అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ 10, ఎంటమాలజీ 10, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ 6, జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ 21, ప్లాంట్‌ పాథాలజీ 10, ప్లాంట్‌ సైకాలజీ 2, సాయిల్‌ సైన్స్‌ 8, సీడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 6, మైక్రోబయాలజీ 4, అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ 2 సీట్లు; ఎంబీఏ(అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) 17 సీట్లు ఉన్నాయి. జగిత్యాల క్యాంప్‌సలో అగ్రానమీ 5, జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ 5, సాయిల్‌ సైన్స్‌ 4 సీట్లు ఉన్నాయి.

  • ఎమ్మెస్సీ(కమ్యూనిటీ సైన్స్‌): మొత్తం 17 సీట్లు ఉన్నాయి. దివ్యాంగులకు ఒక సీటు కేటాయించారు. రాజేంద్రనగర్‌ క్యాంప్‌సలో ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ 9 సీట్లు; హైదరాబాద్‌ క్యాంప్‌సలలో హ్యూమన్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్‌ 2, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ సైన్స్‌(ఫ్యామిలీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌) 2, ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌ 2, అప్పారెల్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ సైన్స్‌ 2 సీట్లు ఉన్నాయి.

  • ఎంటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌): మొత్తం 6 సీట్లు ఉన్నాయి. సంగారెడ్డి- కంది క్యాంప్‌సలో సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్జర్వేషన్‌ ఇంజనీరింగ్‌ 2, ప్రాసెసింగ్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌ 2, ఫామ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌ 2 సీట్లు ఉన్నాయి.


అర్హత వివరాలు

  • స్టేట్‌/సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలు, ఐకార్‌ గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో చదివి ఉండాలి. అభ్యర్థి వయసు 2024 డిసెంబరు 31 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

  • స్పెషలైజేషన్‌ను అనుసరించి నాలుగేళ్ల వ్యవధి గల(బీఎస్సీ/బీఎస్సీ ఆనర్స్‌)(అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/హోం సైన్స్‌/కమ్యూనిటీ సైన్స్‌/ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌); బీటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌/ఫుడ్‌ టెక్నాలజీ/డెయిరీ); బీహెచ్‌ఎస్సీ(రూరల్‌)/ బీహెచ్‌ఎస్సీ/బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/బీఎ్‌ఫఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ఐకార్‌ పీజీ-ఏఐఈఈఏ 2024(ఐకార్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌)లో అర్హత పొంది ఉండాలి.


ఎంపిక

పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఐకార్‌ పీజీ-ఏఐఈఈఏ 2024(ఐకార్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌) స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంబీఏ(ఏబీఎం) కోర్సుకు మాత్రం ఐకార్‌ పీజీ-ఏఐఈఈఏ 2024 స్కోర్‌కు 70 మార్కులు; గ్రూప్‌ డిస్కషన్‌కు 20 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 10 మార్కుల వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000

  • దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబరు 17

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 18

  • కరెక్షన్‌ విండో ఓపెన్‌: అక్టోబరు 19న

  • వెబ్‌సైట్‌: www.pjtsau.edu.in

Updated Date - Oct 11 , 2024 | 06:27 AM