Share News

‘భద్రతామండలిలో భారత్‌’కు పెరిగిన మద్దతు

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:32 AM

ఐరాస భద్రతామండలిని విస్తరించాలని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ అన్నారు.

‘భద్రతామండలిలో భారత్‌’కు పెరిగిన మద్దతు

న్యూయార్క్‌, సెప్టెంబరు 27: ఐరాస భద్రతామండలిని విస్తరించాలని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ అన్నారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీలకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు. మండలిలో ఆఫ్రికాను కూడా చేర్చాలని ప్రతిపాదించారు. మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై అమెరికా, ఫ్రాన్స్‌ ఇప్పటికే మద్దతు ప్రకటించాయి.

Updated Date - Sep 28 , 2024 | 04:32 AM