Share News

TS Polirics: మేడిగడ్డ విచారణపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 14 , 2024 | 07:50 PM

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు.

TS Polirics: మేడిగడ్డ విచారణపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం నాడు తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కేసీఆర్ అన్ని విషయాల్లో అనుభవజ్ఞుడని.. ఆయన లాగా తాము కాదని.. అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహా అడుగుతున్నామని తెలిపారు. మేడిగడ్డ సంఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అంచనాలను అడ్డగోలుగా పెంచారని ధ్వజమెత్తారు. షార్ట్ టైం...హై ఇంట్రస్ట్‌తో అప్పులు తెచ్చారని మండిపడ్డారు. గతంలో పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR మీద విచారణ చేయిస్తామన్నారు. మేడిగడ్డకు కేసీఆర్ వస్తా అంటే స్వాగతిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Updated Date - Feb 14 , 2024 | 07:50 PM