నాకు రూ. 2 కోట్లు ఇచ్చి ఆ ఇంట్లో ఉండొచ్చు..

ABN, Publish Date - Aug 20 , 2024 | 07:14 AM

శ్రీకాకుళం జిల్లా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో కీలక వ్యక్తిగా ఉన్న మాధురి మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దువ్వాడ సతీమణి వాణి తనపై మరోసారి వ్యాఖ్యలు చేసిన కారణంగా తాను మళ్లీ మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

శ్రీకాకుళం జిల్లా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో కీలక వ్యక్తిగా ఉన్న మాధురి మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దువ్వాడ సతీమణి వాణి తనపై మరోసారి వ్యాఖ్యలు చేసిన కారణంగా తాను మళ్లీ మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు. దువ్వాడ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి నిర్మాణం సమయంలో తాను రూ. రెండు కోట్లు ఇచ్చానని.. అందుకుగాను ఆ ఇంటిపై తనకూ హక్కు ఉందని అన్నారు. అందుకు సంబంధించి శ్రీనివాస్ తనకిచ్చిన చెక్కులను మాధురి చూపించారు. తనకివ్వాల్సిన రూ. రెండు కోట్లు ఇచ్చి ఆ ఇంట్లో వాణి ఉందవచ్చునని అన్నారు. లేదంటే మీడియాను పిలిచి ఆ ఇంటి ముందు ధర్నా చేస్తానని మాధురి హెచ్చరించారు.


మాధురి మాటల్లోనే.. ‘శ్రీనివాస్‌ ఇల్లు కట్టడానికి రూ.2 కోట్లు ఇచ్చాను. ఆ డబ్బు కోసం నేను ఆశించడం లేదు. అదే ఇల్లు వాణికి కావాలంటే రూ.2 కోట్లు నాకివ్వాలి. అప్పుడే ఆమెను ఆ ఇంటికి వెళ్లనివ్వండి. లేదంటే నేను కూడా అక్కడకు వచ్చి కూర్చుంటా. నా వల్ల శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని వాణి చెప్పడం కరెక్ట్‌ కాదు. రెండేళ్లుగా శ్రీనివాస్‌ ఆలనా, పాలనా నేనే చూశా. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందు కొచ్చింది. శ్రీనివాస్‌కు ఆమె త్రెట్‌ చేసింది. డోర్లు పగులగొట్టి లోపలకు వచ్చి ఆయనపై దాడికి దిగింది. వాణి వల్ల శ్రీనివాస్‌ కు ముప్పుంది’ అని మాధురి పేర్కొన్నారు. తనకు శ్రీనివాస్‌ బకాయి ఉన్నాడని సంబంధిత చెక్కులను మీడియాకు మాధురి చూపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాన.. వరదై.. వాహనాలను ముంచేసి..

వయసు 30.. కేసులు 34

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 20 , 2024 | 07:14 AM