వంశీకి లుక్ అవుట్ నోటీసులు జారీ..

ABN, Publish Date - Aug 05 , 2024 | 10:04 AM

అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విదేశాలకు వెళ్లారనే ప్రచారం నేపథ్యంలో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వంశీ ఎక్కడ దాక్కున్నాసరే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు క్లారిటీగా చెబుతున్నారు.

అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే (Ex MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కోసం పోలీసులు గాలిస్తున్నారు. విదేశాలకు వెళ్లారనే ప్రచారం నేపథ్యంలో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు (Look out Notice) జారీ చేసినట్లు సమాచారం. వంశీ ఎక్కడ దాక్కున్నాసరే అరెస్టు (Arrest) చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు (Police) క్లారిటీగా చెబుతున్నారు. మరి వంశీ ఇండియాలో ఉన్నారా? లేక విదేశాల్లో తలదాచుకున్నారా? అన్నది సస్పెన్షన్ నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌ (TDP Office)పై దాడి కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు, వైసీపీ నేతలు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపై అప్పట్లో కేసులు నమోదు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అర్ధరాత్రి వరకు జీపులో వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. చివరికి వైసీపీ ప్రభుత్వంలో కేసును పక్కదోవ పట్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసును సీరియస్‌గా తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు భారీ పెట్టుబడులు..!

బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల వలసలు..

జగనన్న లడాయి మాటలు.. బడాయి కూతలు..?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 05 , 2024 | 10:04 AM