Share News

kadiri అలరించిన పౌరాణిక ప్రదర్శన

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:17 AM

ఖాద్రీ లక్ష్మీనర సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కదిరి పట్టణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

kadiri అలరించిన పౌరాణిక ప్రదర్శన
నాటక ప్రదర్శనలో కళాకారులు

కదిరి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ఖాద్రీ లక్ష్మీనర సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కదిరి పట్టణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాలి కల కళాశాల ఆవరణలో నిర్వహించిన పౌరాణిక ప్రదర్శనకు వేలాది మంది హజర య్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన చింతా మణి, సత్యహరిశ్చంద్ర, రామాంజినేయుద్ధం నాటకాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ ప్రదర్శ నతో ఆకట్టుకున్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ సహకారంతో నిర్వహించిన ఈ పౌరాణిక నాటక ప్రదర్శనలో తమిళనాడు రాష్ట్రం ఐఆర్‌ఎస్‌ అధికారి బైరెడ్డి లోకనాథరెడ్డి, బైరెడ్డి కిషోర్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌, కె.మల్లి, పెద్దన్న, గాలివీటి కృష్ణమోహన నాయుడు, జయ, సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ నిర్వాహకులు బండల నాయుడు, కేబీ నాగప్ప, సంగీత మాస్టర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే ఆలయ ఆవరణంలో హరిదాసు సూర్యనారాయణ హరికథా కాలక్షేపం ఆకట్టుకొంది.

Updated Date - Mar 20 , 2025 | 12:17 AM