15నుంచి చేపల వేట బంద్
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:42 AM
సముద్రంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి దృష్టా ఈనెల 15నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపట వేటను నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ ఎఫ్డీవో రెడ్యా నాయక్ తెలిపారు.

కోట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి దృష్టా ఈనెల 15నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపట వేటను నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ ఎఫ్డీవో రెడ్యా నాయక్ తెలిపారు. సముద్ర జలాల్లోకి మెకనైజ్డ్, మోటరు బోట్లు వెళ్లరాదని, నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించడమే కాకుండా ప్రభుత్వం డీజల్ రాయితీని నిలిపివేస్తుందన్నారు.