Share News

వాడపల్లి ఆదాయం రూ.4.56 లక్షలు

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:49 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది

వాడపల్లి ఆదాయం రూ.4.56 లక్షలు

ఆత్రేయపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనం తరం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.4,56,789 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. రావులపాలెం నుంచి వాడపల్లికి పాదయాత్ర గా గోవిందమాలధారులు, భక్తులు సుమారు వెయ్యి మంది గోవిందనామ స్మరణతో స్వామివారి సన్నిధికి చేరుకుని దర్శించుకున్నారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

అన్నదాన భవన నిర్మాణానికి రూ.3లక్షల విరాళం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆల యంలో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి రాజమహేంద్రవరానికి చెందిన దుడ్డుపూడి శ్రీధర్‌, పద్మజ దంపతులు రూ.3లక్షల విరాళం ఇచ్చారు. దాతలకు ఆలయ ఈవో స్వామివారి చిత్రపటం అందించారు.

Updated Date - Mar 17 , 2025 | 12:49 AM