Governor S. Abdul Nazeer : రెడ్క్రాస్ సేవలను ప్రజలకు చేరువ చేయాలి
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:41 AM
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు
ABN AndhraJyothy : ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్గా ఎన్నికైన వైడీ రామారావు, కోశాధికారి పి.రామచంద్రరాజు, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరిడా మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా వారిని గవర్నర్ అభినందించి, పలు సూచనలు చేశారు. రెడ్క్రాస్ సేవా కార్యక్రమాలకు తన సహాయ, సహకారాలు అందజేస్తానన్నారు.