Share News

Jagan Mohan Reddy: జగన్‌ రైతు ద్రోహి

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:58 AM

మంత్రి సవిత మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినా ఆయన రైతులను పరామర్శించలేదన్నారు. కడప, అనంతపురం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు.

Jagan Mohan Reddy: జగన్‌ రైతు ద్రోహి

సీఎంగా అన్నమయ్య డ్యాం బాధితులను పట్టించుకోలేదు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం: మంత్రి సవిత

‘అనంత’లో ఉద్యాన పంటల నష్టాన్ని పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే శ్రావణి

తాడిపత్రి/యల్లనూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగినా మాజీ సీఎం జగన్‌ రైతులను పరామర్శించేందుకు రాలేదు. ఆయనకు రైతులపై ఏమాత్రం అభిమానం లేదు’ అని మంత్రి సవిత అన్నారు. అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం నీర్జాంపల్లి, గొడ్డుమర్రి గ్రామాల పరిధిలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పండ్ల తోటలను ఆమె సోమవారం పరిశీలించారు. నీర్జాంపల్లి పొలాల్లో మీడియాతో మాట్లాడారు. ‘జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా బాధితులను పరామర్శించలేదు. తన బంధువు చనిపోవడంతో ఆయన పులివెందుల వెళ్లారు. కానీ దెబ్బతిన్న పంటలు పరిశీలించడానికి కాదు. రైతుల పట్ల ఆయనకు ప్రేమాభిమానాలు లేవు. జగన్‌ రైతు ద్రోహి. అకాల వర్షాలతో కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 1,547 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మొత్తం 1,240 మంది రైతులు రూ.60 కోట్ల వరకు నష్టపోయారు. హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ అధికారులు నివేదికను తయారు చేస్తున్నారు. హెక్టారుకు రూ.35 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. గత ప్రభుత్వంలో రూ.25 వేలు మాత్రమే ఉండేది. నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్నీ ఆదుకుంటాం. రైతులకు జరిగిన నష్టంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు తెలుసుకున్నారు. రైతులు ఆత్మహత్యల జోలికి వెళ్లవద్దు. ఇప్పటికే అనంతపురం, కడప కలెక్టర్లు ప్రభుత్వానికి జరిగిన నష్టం గురించి తెలియజేశారు’ అని మంత్రి సవిత తెలిపారు. ఆమె వెంట ఎమ్మెల్యే బండారు శ్రావణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడుయాదవ్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివనారాయణ, ఆర్డీఓ కేశవనాయుడు, ఉద్యాన, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:58 AM