-
-
Home » Andhra Pradesh » Today Breaking News MLC Elections in AP and Telangana Actor Posani Arrest Live Updates Thursday 27th February 2025 Amar
-

BREAKING NEWS: హెచ్సీయూలో ప్రమాదం..
ABN , First Publish Date - Feb 27 , 2025 | 11:27 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-02-27T21:12:25+05:30
హెచ్సీయూలో ప్రమాదం..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రమాదం.
కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.
శిథిలాల కింద ఒక కార్మికుడు చిక్కుకున్నట్లు అనుమానం.
-
2025-02-27T16:23:39+05:30
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఏపీలో 3, తెలంగాణలో 3 MLC స్థానాలకు పోలింగ్
మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-
2025-02-27T13:48:42+05:30
పోలింగ్ కేంద్రాల వద్ద నోట్ల పంపిణీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ
తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల స్థానంలో డబ్బుల పంపిణీ ఆరోపణలు
పిఠాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఓటర్లకు డబ్బులు ఇచ్చారంటూ ఆరోపణలు
ఒక ఓటుకు రూ.3వేలు పంపిణీ
నోట్ల పంపిణీతో తమకు సంబంధం లేదంటున్న కూటమి నేతలు
ఎవరో పంపిణీ చేస్తే, తమకు ఏమి సంబంధం అంటున్న కూటమి నేతలు
-
2025-02-27T12:40:16+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పార్వతీపురం మన్యం జిల్లాలో కి 60.65 శాతం పోలింగ్ నమోదు
-
2025-02-27T12:38:52+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం
ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
సూర్యాపేట జిల్లాలో 45.53 శాతం ఓటింగ్ నమోదు
యాదాద్రి-భువనగిరి జిల్లాలో 48.58శాతం ఓటింగ్ నమోదు
-
2025-02-27T12:36:46+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం
ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 54.34 శాతం ఓటింగ్ నమోదు
ఓటు హక్కు వినియోగించుకున్న 1393 మంది పురుషులు, 829 మంది మహిళలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
46.44 శాతం నమోదు
-
2025-02-27T12:36:45+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం
నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల స్థానానికి 27.44 శాతం పోలింగ్
నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల స్థానానికి 42.12 శాతం పోలింగ్
-
2025-02-27T11:58:57+05:30
సీఎం రేవంత్పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డి మోడీని కలిసి అంతులేని అబద్ధాలు మాట్లాడారు
దృష్టి పెట్టాల్సిన అనేక అంశాలు పక్కన పెట్టి కేసిఆర్పై ఇష్టానుసారంగా మాట్లాడారు
2024-25 కాగ్ రిపోర్ట్ లో అప్పు గురించి స్పష్టంగా చెప్పారు
రూ.6500 కోట్లు వడ్డీ కడుతున్నామని అవాస్తవాలు చెప్పారు
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు
రాష్ట్రానికి రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుందంటున్నారు
రూ.12వేల కోట్ల ఆదాయం వస్తుందని కాగ్ చెబుతోంది.
రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా
హైడ్రా తో దారుణంగా రాష్ట్ర ఆదాయం రూ.5వేల కోట్ల వరకు పడిపోతుంది
హైకోర్టు హెచ్చరిస్తున్నా కూల్చివేతలు ఆపడం లేదు
కొత్త విషయాలు ఏవీ మోడీ తో మాట్లాడలేదు
ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నారు.
-
2025-02-27T11:51:10+05:30
బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాల్టీ పరిధిలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ -కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం
బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకున్నాడని కార్యకర్తల ఆందోళన
బీజేపీ కార్యకర్తలపై దూసుకెళ్ళిన కాంగ్రెస్ నేతలు
పరస్పరం రాళ్లు రువ్వుకున్న బీజేపీ -కాంగ్రెస్ కార్యకర్తలు
తీగల్ పహాడ్లో తీవ్ర ఉద్రిక్తత,
ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు,
పరిస్థితి ని సమీక్షిస్తున్నపోలీసు కమిషనర్ శ్రీనివాస్
-
2025-02-27T11:47:16+05:30
పోసాని సతీమణికి జగన్ ఫోన్
పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ను ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్
పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో పరామర్శించిన వైయస్ జగన్
పోసాని అరెస్ట్ విషయంలో అండగా ఉంటామని ధైర్యం చెప్పిన జగన్
కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందన్న జగన్
పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా
పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామన్న జగన్
-
2025-02-27T11:41:56+05:30
మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏకే టీపీ స్కూల్ వద్ద పోలింగ్ బూత్ ను సందర్శించిన ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు
మంత్రి సత్య కుమార్ యాదవ్ కామెంట్స్
ఇప్పటివరకు 25 శాతం పోలింగ్ నమోదు
చదువుకున్న విద్యార్థులంతా ముందుకు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలి.
పట్టభద్రుల ఓటు ద్వారా సరైన నాయకుడుని ఎన్నుకోవచ్చు
ప్రజలు ఇప్పటివరకు ఐదేళ్ల రాక్షస పాలన చూశారు
చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం మంచి పాలన చూస్తున్నారు
గడిచిన ఎనిమిది నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు , అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి.
సాయంత్రం లోపుగా ఎక్కువమంది వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి.
-
2025-02-27T11:27:35+05:30
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలహలం
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్
తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల స్థానానికి పోలింగ్
ఏపీలో కూటమి, పీడీఎఫ్ మధ్య తీవ్ర పోటీ
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ మధ్య తీవ్రపోటీ
ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్