Share News

Gold and Silver Rates Today: మహిళలకు బిగ్ షాక్.. బంగారం ధర ఎంత పెరిగిందంటే..

ABN , Publish Date - Jan 23 , 2025 | 06:57 AM

బిజినెస్ డెస్క్: బంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. నిన్న (బుధవారం) స్వల్పంగా తగ్గిన పసిడి ధర నేడు (23-01-2025) మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,400 ఉండగా.. ఇవాళ ఉదయం 06:30 గంటల సమయానికి తులానికి రూ.10ల చొప్పున పెరిగి రూ.75,410కి చేరింది.

Gold and Silver Rates Today: మహిళలకు బిగ్ షాక్.. బంగారం ధర ఎంత పెరిగిందంటే..
Gold and Silver Rates Today

బిజినెస్ డెస్క్: బంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. నిన్న (బుధవారం) స్వల్పంగా తగ్గిన పసిడి ధర నేడు (23-01-2025) మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,400 ఉండగా.. ఇవాళ ఉదయం 06:30 గంటల సమయానికి తులానికి రూ.10ల చొప్పున పెరిగి రూ.75,410కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నిన్న రూ.82,240 ఉండగా.. నేడు తులానికి రూ.10లు పెరిగి రూ.82,250 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల తులం పసిడి ధర నిన్నటి ధరలతో పోలిస్తే రూ.10లు పెరిగి రూ.75,260 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.10లు పెరిగి రూ.82,100గా ఉంది.


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. ఢిల్లీలో బుధవారం కిలో వెండి రూ.96,500 ఉండగా.. నేడు కిలోకు రూ.100 తగ్గి రూ.96,400గా ఉంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో నిన్న కిలో వెండి రూ.1,04,000 పలకగా.. నేడు కిలోకు రూ.100 తగ్గి రూ.1,03,900 పలుకుతోంది.


దేశవ్యాప్తంగా 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే..

  • బెంగళూరు- రూ.75,260, రూ.82,100

  • భవనేశ్వర్- రూ.75,260, రూ.82,100

  • ముంబై- రూ.75,260, రూ.82,100

  • కోల్‌కతా- రూ.75,260, రూ.82,100

  • జైపూర్-రూ.75,410, రూ.82,250

  • హైదరాబాద్‌- రూ.75,260, రూ.82,100

  • విజయవాడ- రూ.75,260, రూ.82,100

  • ఢిల్లీ- రూ.75,410 రూ.82,250

  • చెన్నై- రూ.75,260, రూ.82,100

Updated Date - Jan 23 , 2025 | 07:20 AM