లాభాల స్వీకారంతో జోరుకు బ్రేక్
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:59 AM
వరుసగా ఆరు రోజుల పాటు అద్భుతమైన ర్యాలీలో ట్రేడయిన ఈక్విటీ మార్కెట్ జోరుకు మంగళవారం బ్రేక్ పడింది. లాభాల స్వీకారంతో ప్రారంభ లాభాలు ఆవిరైపోగా...

33 పాయింట్ల లాభానికే పరిమితమైన సెన్సెక్స్
ముంబై: వరుసగా ఆరు రోజుల పాటు అద్భుతమైన ర్యాలీలో ట్రేడయిన ఈక్విటీ మార్కెట్ జోరుకు మంగళవారం బ్రేక్ పడింది. లాభాల స్వీకారంతో ప్రారంభ లాభాలు ఆవిరైపోగా ఈక్విటీ సూచీలు స్వల్ప లాభంతోనే ముగిశాయి. వరుసగా ఏడో రోజు కూడా అదే ఉత్సాహంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 757.31 పాయింట్ల లాభంతో 78,741.69 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకింది. కాని చివరికి 32.81 పాయింట్ల స్వల్ప లాభంతో 78,017.19 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 10.30 పాయింట్ల లాభంతో 23,668.65 వద్ద క్లోజయింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఏడు సెషన్ల ర్యాలీకి తెర దించింది. మంగళవారం డాలర్ మారకంలో 11 పైసలు నష్టపోయి 85.72 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి:
Single Recharge: ఒకే రీఛార్జ్తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News