Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. కేజ్రీవాల్కు ఊహించని షాక్
ABN , Publish Date - Feb 08 , 2025 | 08:48 AM
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ అయింది. అయితే ఊహించని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ షురూ అయింది. 19 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. ఇందులో బీజేపీ హవా నడుస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లో సీఎం అతిశీ, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇతర కీలక ఆప్ నేతలు వెనుకంజలో ఉన్నారు. న్యూ ఢిల్లీ స్థానం నుంచి పోటీచేసిన కేజ్రీవాల్ మీద బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ముందంజలో కొనసాగుతున్నారు. కల్కాజీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అతిశీపై బీజేపీ క్యాండిడేట్ రమేశ్ ముందంజలో ఉన్నారు.
ఇదీ చదవండి:
ఢిల్లీ పీఠం దక్కాలంటే ఎన్ని సీట్లు గెలవాలి.. 3 పార్టీల ధీమా ఏంటి
ఆప్ నాలుగోసారి గెలుస్తుందా లేదా బీజేపీ కైవసం చేసుకుంటుందా..
విదేశాల్లోని జైళ్లలో 10,152 మంది భారతీయులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి