Rahul Market Talk: 'స్టాక్ మార్కెట్ అందరికీ కాదు': రాహుల్ గాంధీ
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:46 PM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ సుంకాలు భారత స్టాక్ మార్కెట్ను కుప్పకూల్చిన తర్వాత రాహుల్ గాంధీ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. మనకొద్దీ వ్యాపారం అనేలా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర(రెసిప్రోకల్) సుంకాలను ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్ల పతనంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. స్టాక్ మార్కెట్లో అపరిమిత డబ్బు సంపాదిస్తున్నప్పటికీ, అందరికీ దాని ప్రయోజనం లభించదని ఆయన పేర్కొన్నారు. "అమెరికా అధ్యక్షుడు స్టాక్ మార్కెట్లో పతనానికి దారితీశారు. ఇక్కడి ప్రజలలో ఒక శాతం కంటే తక్కువ మంది స్టాక్ మార్కెట్లో తమ డబ్బును పెట్టుబడి పెట్టారు. అంటే స్టాక్ మార్కెట్ మీకు అనువైన స్థలం కాదు. దానిలో అపరిమిత డబ్బు సంపాదిస్తారు. కానీ మీరు దాని ప్రయోజనం పొందలేరు" అని గాంధీ పాట్నాలో జరిగిన 'సంవిధాన్ సురక్ష సమ్మేళన్' (రాజ్యాంగాన్ని సేవ్ చేయండి)లో ప్రసంగిస్తూ చెప్పారు.
ఏప్రిల్ 2న, అధ్యక్షుడు ట్రంప్ స్నేహపూర్వక దేశాలు సహా అమెరికాకు వచ్చే దాదాపు అన్ని దిగుమతులపై రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మన వస్తువులపై 26 శాతం పన్ను కూడా ఉంది. ఈ చర్య ఇవాళ సోమవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున షేర్ల అమ్మకాలకు దారితీసింది. భారతదేశ బెంచ్మార్క్ సెన్సెక్స్ సూచీ ఇంట్రాడే ట్రేడ్లో దాదాపు 4,000 పాయింట్లు పడిపోయింది.
"ట్రంప్ భ్రమను వదిలించారు. వాస్తవాలు తిరిగి తెలుస్తున్నాయి. ప్రధాని మోడీ ఎక్కడా కనిపించడం లేదు. భారతదేశం వాస్తవికతను అంగీకరించాలి. భారతీయులందరికీ ఉపయోగపడేలా ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడం తప్ప మనకు వేరే మార్గం లేదు" అని కాంగ్రెస్ ఎంపీ X(సామాజిక మాధ్యమం)లో ఉంచిన ఒక పోస్ట్లో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ
YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్పై షర్మిల ఫైర్