Ex-Gratia: గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.3.3 కోట్ల ఎక్స్ గ్రేషియా విడుదల: టీజీఎమ్డీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:21 PM
66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం శుక్రవారం ఎక్స్ గ్రేషియాను విడుదల చేసిందని టీజీఎమ్డీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి తెలిపారు.

గతంలో 103 మందికి రూ.5.15 కోట్లు చెల్లింపు
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం శుక్రవారం రూ.3 కోట్ల 30 లక్షల ఎక్స్ గ్రేషియాను వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసిందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి తెలిపారు.
Also Read: తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్ల పంపిణీ
సీఎం సూచన మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ప్రణాళిక) కె. రామక్రిష్ణా రావు సహకారంతో నిధులు విడుదల చేయించానని అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 28 మంది, జగిత్యాల 19, కామారెడ్డి 9, నిర్మల్ 7, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున 66 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని వివరించారు. గతంలో 103 మందికి రూ.5 కోట్ల 15 లక్షలు విడుదల చేశారని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 169 మందికి రూ.8 కోట్ల 45 లక్షలు చెల్లింపు జరిగిందని అనిల్ వివరించారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి