Share News

MP Etala: ఎంపీ ఈటల ఆసక్తికర కామెంట్స్.. కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే

ABN , Publish Date - Jan 21 , 2025 | 10:53 AM

మల్కాజిగిరి ఎంపీ, మాజీమంత్రి ఈటల రాజేందర్‌(Malkajgiri MP and former minister Etala Rajender)ను మీర్‌పేట్‌కు చెందిన బీజేపీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్‌ శంకర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

MP Etala: ఎంపీ ఈటల ఆసక్తికర కామెంట్స్.. కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే

హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపీ, మాజీమంత్రి ఈటల రాజేందర్‌(Malkajgiri MP and former minister Etala Rajender)ను మీర్‌పేట్‌కు చెందిన బీజేపీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్‌ శంకర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకుగాను మహేశ్వరం నియోజకవర్గం(Maheshwaram Constituency)లో పర్యటించాల్సిందిగా కోరారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కోకాపేట ‘నియోపోలీసు’లో రిజర్వాయర్‌


city9.2.jpg

అనంతరం ఈటల మాట్లాడుతూ.. తెలంగాణలో రానున్నది బీజేపీ(BJP) ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ పని అయిపోయినట్టేనని అన్నారు. పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి బీజేపీ జెండా ఎగురవేయడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొండ్రు గౌరీశంకర్‌, ఇంద్రావత్‌ రవినాయక్‌, పార్టీ నాయకులు రాజేశ్‌రెడ్డి, ఇంద్రాజీ, శేఖర్‌రెడ్డి, బాలకృష్ణ, కె.వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2025 | 10:53 AM