Share News

Hyderabad: న‘గరం’ @ 40.. పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 07:43 AM

హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గురువారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగడంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Hyderabad: న‘గరం’ @ 40.. పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

- పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో ఎండలు మండుతున్నాయి. రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో నగరవాసులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: AE: ఏసీబీకి దొరికిన విద్యుత్‌ శాఖ ఏఈ


city1.2.jpg

గురువారం నగరంలోని కాప్రా, నాచారం, ఎల్‌బీనగర్‌, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‏గూడ, బేగంపేట(Yusufguda, Begumpet) ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు, గాజులరామారం, రాజేంద్రనగర్‌(Gajularamaram, Rajendranagar)లలో అత్యధికంగా 40 డిగ్రీలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశముందని బేగంపేట(Begumpet) వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్‌

పాస్టర్‌ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు

మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు

గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2025 | 07:43 AM