Trump:ట్రంప్ ఎఫెక్ట్.. రొయ్యల రైతులకు భారీ షాక్
ABN, Publish Date - Apr 07 , 2025 | 06:31 PM
అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని ఓ సామెత ఉంది. ప్రపంచ దేశాల్లో పెద్దన్న లాంటి అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తోంది.
అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తోందని ఓ సామెత ఉంది. ప్రపంచ దేశాల్లో పెద్దన్న లాంటి అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తోంది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు సుంకాల దెబ్బకు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వారంగం కుదేలవుతోంది. అసలు ట్రంప్ నిర్ణయానికి, ఆక్వారంగానికి సంబంధం ఏంటీ అనేది ఈ కథనంలో చూద్దాం. ఓ వైపు రొయ్యలకు వ్యాధులు, మరోవైపు ధరల పతనం, మేత ధరల పెంపు, పెట్టుబడి ఖర్చులతో ఆక్వారంగం చాలా కష్టాల్లో ఉంది.
ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆక్వారంగాన్ని మరింత కుదేలయ్యేలా చేసింది. అవును భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో ఆక్వారంగానికి భారీ షాక్ తగిలింది. గంటల వ్యవధిలోనే రొయ్యల ధరలు పతనం అయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ప్రధానంగా భీమవరం చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో రొయ్యల సాగు ఎక్కువగా సాగవుతోంది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆక్వా ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
Mega Health Hub: ఆరోగ్య రంగంలో సంస్కరణలు.. చంద్రబాబు విజన్ ఇదే
Pawan Visit Alluri District: అప్పుడు చెప్పా.. ఇప్పుడు సాకారం
Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ
YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్పై షర్మిల ఫైర్
Read Latest AP News And Telugu News
Updated at - Apr 07 , 2025 | 06:57 PM