Home » Brahmotsavalu
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మో్త్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెందో రోజు ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.
శ్రీగిరిపై బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం జరుగుతోంది. సాయంత్రం సదస్యం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తు కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ చేస్తారు.
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆది దంపతులకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు స్వామి అమ్మవార్లు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం తరుపున అధికారులు శ్రీశైలం శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. బుధవారం ఉదయం ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది. శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయం ముస్తాబవుతోంది. శక్తి పీఠం, జ్యోతిర్లింగం కొలువైన ప్రదేశం కావడంతో మహాశివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుని భక్తులు తరిస్తుంటారు.
ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.
భక్తి శ్రద్ధలతో భక్తులు తాళ్లతో లాగుతుండగా, మహారథంపై దేవేరులతో కలిసి నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 8 వ రోజు వీరలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.