Home » BRS Chief KCR
ధరణీ అనే భూతంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని, రైతులకు దాని ద్వారా మోక్షం కల్పిస్తామని అన్నారు. అద్భుతమైన రెవెన్యూ చట్టం తీసుకుని రాబోతున్నామని స్పష్టం చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన దొరవారు సూచనలు చేస్తే పరిశీలించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి స్థానికత విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) అన్నారు. గత పదేళ్లలో అసెంబ్లీ ఇలా జరగలేదని చెప్పారు. తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.
బీఆర్ఎస్ నేతలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. హరీష్రావును కూడా గతంలో మంత్రిగా కాంగ్రెస్ చేయలేదా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సంచలన ఆరోపణలు చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో భట్టి మాట్లాడారు. గత పదేళ్లలో హైదరాబాద్కు పెట్టుబడులు భారీగా వచ్చాయని బీఆర్ఎస్ చెప్పుకుందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఢిల్లీ వెళ్లి అక్కడ వరుస సమీక్షలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణాలు తీసుకున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు.
ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని.. దానిని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.