Home » Congress Govt
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు.
కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠాశాలలతో అన్నికూలల అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
ప్రభుత్వం సాఫీగా నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తేనే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తాము తప్పులేకుండా స్వేచ్ఛగా ప్రజాపాలన చేస్తున్నామన్నారు. 6 గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని మల్లు రవి వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యంగులు ఉన్నారు. వారి సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.50 కోట్లను కేటాయించిందని అన్నారు.
మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న వారికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.మూసీని అభివృద్ధి చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరబాద్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఫైర్ అయ్యారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్రెడ్డి చెప్పాలని అడిగారు. తాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు కావాలి.. ఎన్ని తెస్తారో చెప్పాలని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నిస్తునే ఉంటానని హరీష్రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోసం, దగా, వంచనకు రేవంత్రెడ్డి ఏడాది పాలనే నిలువెత్తు నిదర్శనమని అన్నారు. అధికారం కోసం ప్రజలను మోసగించడం రేవంత్ నైజమని హరీష్రావు ఆరోపించారు.
హుజురాబాద్ ఏసీపీ దళితులను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఏసీపీ చిట్టా మొత్తం నా దగ్గర ఉందని హెచ్చరించారు. పోలీసులు బెదిరింపులకు తాము భయపడమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు.
పది నెలల వ్యవధిలో 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రుణమాఫీలో తెలంగాణ రికార్డ్ సాధించిందని అన్నారు. 11 నెలల పాలనలో రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు.
సంక్రాంతి తరువాత రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 5న ఇందిరమ్మఇళ్లకు సంబంధించిన యాప్ ఒపెన్ చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి బృందాలు వస్తాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.