Home » Congress
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కొత్త సారధి నియామకం త్వరలోనే జరగనుందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మార్పు అనివార్యమైతే ఆయన స్థానంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రెకు అవకాశం దక్కనుందని అభిప్రాయాలు జోరందుకున్నాయి.
అహ్మదాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశం, ఏఐసీసీ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు చిదంబరం వచ్చారు. సబర్మతి ఆశ్రమం వద్ద ప్రార్థనా సమావేశానికి ఆయన హాజరయినప్పుడు వడదెబ్బ తగిలింది.
రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేసే ప్లాన్ వెల్లడించారు. పట్నాలో జరిగిన ‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’లో ఆయన వెనుకబడిన వర్గాలకు కులగణన నిర్వహిస్తామని చెప్పారు
CWC Meetings: అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సచివాలయంలో కాంగ్రెస్ నేతలు సమీక్ష నిర్వహించడం, మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ నిర్ణయం తీసుకోవడం తెలంగాణలో పాలన భ్రష్టు పట్టడమేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి మజ్లి్స గెలిపించేందుకు పని చేస్తున్నారని అన్నారు
కంచ గచ్చిబౌలి భూములను హెచ్సీయూకే రిజిస్టర్ చేయించాలని ఆ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ను కోరారు.
బీఆర్ఎస్తో ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లేదంటే బలమే లేని చోట బీజేపీ ఎలా బరిలో నిలుస్తుందని ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
కంచ గచ్చిబౌలి భూముల వివాదం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల ఆందోళనల అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
లోక్సభలో బుధవారంనాడు బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా, బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. దీంతో లోక్సభలో బిల్లు ఆమోదం పొందింది. అనంతరం గురువారం అర్ధరాత్రి దాటే వరకూ బిల్లుపై చర్చ జరిపి ఓటింగ్ నిర్వహించారు.