Home » Jammu and Kashmir
జమ్మూ కశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలోని దుడు ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మరణించారు. దుడు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్ను మరింతగా మోహరించేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో బెటాలియన్పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగి.. కాల్పులు జరిపారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం శ్రీనగర్లో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్టికల్ 370తోపాటు 35ఏని పునరుద్దరిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు మరో 10 అంశాలను మేనిఫెస్టో జాబితాలో పొందు పరిచారు.
ఆదివారం శ్రీనగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీందర్ రైనా మాట్లాడారు. త్వరలో తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. మొత్తం అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతామని ఆయన స్పష్టత ఇచ్చారు.
జమ్మూ కశ్మీర్లో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జీ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తోపాటు ఆ పార్టీలోని కీలక నేతలు తరుణ్ చుగ్, రవీంద్ర రైనా తదితరులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. అలాగే 80 శాతం మంది కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలో దింపాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తుంది.
రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్లో మూడు దశల్లో (సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1).. హరియాణాలో అక్టోబరు 1న శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం వెల్లడించింది.
Jammu and Kashmir Election Schedule: దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 3వ తేదీతో హర్యానా అసెంబ్లీ పదవీ కాలం..
దాదాపు 200 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 88 మంది ఐఏఎస్, కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను బదిలీ చేసింది. అలాగే 33 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. వీరంతా ఐజీల నుంచి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్థాయి అధికారులను బదిలీ చేసింది.
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీఐ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పష్టత ఇచ్చారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు రెండు నెలలైంది. మళ్లీ దేశంలో ఎన్నికల కోలహాలం మొదలుకాబోతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. దీనిలో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.