Home » Kanaka durga temple
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల కోసం అధికారుల, పాలకమండలి సర్వం సిద్ధం చేశారు. ఆలయంలో ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్2కు 2.5 కోట్లు ఖర్చు చేసామని చెప్పారు.
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం( Vijayawada Kanaka Durgamma Temple) అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని.. మాస్టర్ ప్లాన్ ప్రకారం టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు.. ఈ పనులను వేగంగా పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ (Minister Satyanarayana) తెలిపారు.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
దుర్గగుడి పాలకమండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శివాలయంలో 40 లక్షల అంచనాతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తామన్నారు.
విజయవాడ: శ్రావణమాసం రెండవ శుక్రవారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఆఖరిరోజుకు చేరుకున్నాయి.
ప్రముఖ పుణ్యక్షత్రం కనకదుర్గంగుడిలో శాకాంబరీ ఉత్సవాల వేళ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు మరోసారి బయటపడ్డాయి.
ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి మూల విరాట్ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అర్చక స్వాములు అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో జూన్ 19 నుంచి ఆషాడమాసం సారె ప్రారంభంకానున్నట్లు దుర్గుగుడి ఈవో భ్రమరాంబ ప్రకటించారు.