Rains: కూల్.. కూల్.. చల్లబడిన వాతావరణం
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:41 AM
కూల్.. కూల్.. వాతావరణం చల్లబడింది. గతకొద్దిరోజులుగా ఎండవేడితో అల్లాడిపోయిన ప్రజలకు గురువారం సాయంత్రం నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలకు కొంత ఉపశమనం దొరికినట్లు అయింది.

బెంగళూరు: వేసవి ఎండలతో తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునేలా చల్లదనం కలిసివచ్చింది. గురువారం మధ్యాహ్నం బెంగళూరు(Bengaluru) నగరంతో పాటు దక్షిణ ప్రాంత జిల్లాలు మైసూరు, మండ్యతో పాటు హాసన్, శివమొగ్గ(Hassan, Shivamogga), తీర ప్రాంత జిల్లాల వ్యాప్తంగా వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో వరుణుడు కరుణించినట్లు అయ్యింది.
ఈ వార్తను కూడా చదవండి: JD (U): నితీష్ కుమార్కు బిగ్ షాక్
మధ్యాహ్నం 12గంటల నుంచి ప్రాంతాల వారీగా రెండుగంటల దాకా వర్షం కురిసింది. మధ్యాహ్నం కురిసిన వానకు రోడ్లపై ద్విచక్రవాహనదారులు, నడిచి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. ప్రధాన రోడ్లలో నీరు నిల్వ ఉండటంతో సమస్య ఏర్పడింది. రాజాజీనగర్(Rajajinagar)లో ఓ చెట్టు విరిగి పడి రెండుకార్లు ధ్వంసమయ్యాయి. నగరమంతటా వర్షంతో ప్రజలు రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. విధానసౌధలో పనులు చేస్తున్న కార్మికులు ఏమాత్రం లెక్కచేయకుండా కొనసాగించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్!
మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్ జైలుకే!
రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..
Read Latest Telangana News and National News