Home » Kolkata doctor rape-murder case
2021 నుంచి ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని హత్యాచారానికి గురైన ఆ కాలేజీ వైద్యురాలి తండ్రి వెల్లడించారు. ఆ నాడే ప్రొ. సందీప్ ఘోష్పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఈ రోజు తమ కుమార్తె బతికి ఉండేదన్నారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ ఫామ్ హౌస్పై ఈడీ సోదాలు చేపట్టింది. అలాగే అధికార టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ నివాసంలో సైతం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ రెండు ప్రదేశాల్లో ఈడీ ఏక కాలంలో దాడులు చేసింది. ఎమ్మెల్యే రాయ్.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో చర్చలు జరిపారు.
ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసులో 'ఆర్థిక అవకతవకల' కోణం నుంచి సీబీఐ విచారణ కొనసాగుతోంది. మాజీ ప్రిన్సిపల్పై జరిపిన పాలిగ్రాఫ్ టెస్టుపై సీబీఐ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఆర్జీ కర్ ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతూ జూనియర్ వైద్యులు ఆరోగ్య శాఖ ప్రధానకార్యాలయమైన 'స్వాస్థ్వ భవన్' ఎదుట జరుపుతున్న బైఠాయింపు నిరసనలు సోమవారంతో 8వ రోజుకు చేరుకున్నాయి.
కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీ్సస్టేషన్ ఎస్హెచ్వో అభిజిత్ మండల్లను స్థానిక కోర్టు సెప్టెంబరు 17 వరకు సీబీఐ కస్టడీకి పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమబెంగాల్లో వైద్య విద్యలో భారీ కుంభకోణం జరిగినట్లు స్థానిక మీడియా ఆరోపించింది. పలువురు వైద్యులతో కూడిన ఈ శక్తిమంతమైన లాబీ.. వైద్య విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపింది.
జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న స్వాస్థ భవన్కు వెళ్లిన మమతా బెనర్జీ తన ప్రసంగంలో ఎక్కువ సేపు తన గురించే ప్రస్తావించుకున్నారని, ఆమె గురించి కొంచెం ఎక్కువుగా చెప్పుకున్నారంటూ ఎద్దెవా చేశారు. మమతా బెనర్జీ వ్యక్తిత్వానికి..
దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా ఆర్జీ కర్ వైద్య కళాశాల విద్యార్థిని హత్యాచార కేసులో ఆ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరోసారి అరెస్టు చేసింది.
జూనియర్ వైద్యులు ప్రధానంగా 5 డిమాండ్లపై పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవల కోసం తమ పని పరిస్థితులను మెరుగుపరచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచాలని, హత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని, ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.