Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో 26 మంది బాలికలు(girls) అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమ బాలికల గృహం నడుస్తోంది.
గత కొంతకాలం నుంచి గుండెపోటు సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా.. కొవిడ్ కాలం నుంచి ఈ తరహా కేసులు విపరీతంగా పెరిగాయి. బలంగా, ఆరోగ్యంగా కనిపించే యువకులు సైతం గుండెపోటు బారిన..
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీ కొన్న ఘటనలో మంటలు చేలరేగి 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు.
నాలుగు సార్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి ఇప్పడు తన అడ్రెస్ మార్చారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. B8 74 బంగ్లాకు మకాం మార్చారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఘనవిజయం సాధించి మరోసారి అధికారంలోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ మంత్రివర్గాన్ని తొలిసారిగా సోమవారంనాడు విస్తరించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో కైలాష్ విజయవర్గీయ, ప్రహ్లాద్ పటేల్ సహా 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 19 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు. ఎంపీ దిగ్గజాలైన ప్రద్యుమ్న్ సింగ్ తోమర్, విశ్వాస్ సారంగ్లు కూడా కొత్త మంత్రివర్గంలో చేరారు.
బకాయిల కోసం ఇండోర్లోని హుకుంచంద్ మిల్ వర్కర్ల చిరకాలంగా చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. కార్మికులకు ఇవ్వాల్సిన రూ.224 కోట్ల బకాయిల మొత్తం చెక్కును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందజేశారు. ఆదివారంనాడు ఈ చెక్కును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఫీషియల్ లిక్విడేటర్, హుకుంచంద్ మిల్ కార్మిక సంఘం ప్రతినిధులకు పీఎం అందించారు.
CM Mohan Yadav: నేడు మధ్యప్రదేశ్ కేబినెట్ను విస్తరించనున్నారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రి వర్గంలో 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైమ్ మెరిడియన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ గుండా వెళ్తుందని, కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రపంచ కాలాన్ని మార్చడానికి తాను కృషి చేస్తానని తెలిపారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీ రాష్ట్ర యూనిట్ను అధిష్ఠానం పునర్వవస్థీకరించింది. పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలిగించింది. ఆయన స్థానంలో రావూ ఎమ్మెల్యే జీతూ పట్వారిని పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడిగా ప్రకటించింది.
మూడు రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హిడ్మా అలియాస్ చైతు ఎన్కౌంటర్లో హతమైనట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. గురువారం..