Home » Manipur
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ బంగ్లా సమీపంలో ఎవరూ లేని ఒక భవంతిలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నాలుగు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి.
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ మెరుపు దాడిలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. సోమవారం ఉదయం జిరిబామ్ సమీపంలో జాతీయ రహదారి-37పై ఈ ఘటన చోటుచేసుకుంది. మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న జిరిబామ్ను సీఎం బీరేన్ మంగళవారం సందర్శించాల్సి ఉంది.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్పై మిలిటెంట్లు సోమవారంనాడు కాల్పులకు తెగబడ్డారు. కల్లోలిత జీరాబామ్ జిల్లాకి కాన్వాయ్ వెళ్తుండగా మార్గమధ్యంలోని కాంగ్పోక్పి జిల్లాలో మిలిటెంట్లు పలురౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు.
బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
మణిపూర్(Manipur)లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షం(heavy rain), వడగళ్ల వాన కారణంగా పలు ఇళ్లు, అనేక వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంఫాల్ వెస్ట్లోని కాంచీపూర్, తేరాతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రంలో మే 6, మే 7న పాఠశాలలు(Schools), కళాశాలలు(colleges) బంద్ చేస్తున్నట్లు సీఎం ఎన్ బీరెన్ సింగ్(Biren Singh) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
గతేడాది మే 3న మణిపూర్ ప్రారంభమైన హింస నేటికీ కొనసాగుతోందని, కుటుంబ సభ్యులతోపాటు ఇళ్లు, ఆస్తులు, కుటుంబాలను కోల్పోయిన వేలాదిమంది నిరాశ్రయులయ్యారని హైదరాబాద్లో నివసిస్తున్న మణీపూర్(Manipur) కూకీ-జో తెగలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మణిపుర్ అల్లర్ల కేసులో సీబీఐ(CBI) ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఇందులో మణిపుర్ పోలీసుల వైఖరి, వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకల దాడులు జరుగుతున్న క్రమంలో సాయం కోరడానికి వచ్చిన బాధితులను ఏ మాత్రం పట్టించుకోకుండా మూకలకు సహకరించారని ఛార్జ్ షీట్లో వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్లో భాగంగా ఈనెల 26న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఔటర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 6 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ కు భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్ 30న ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది.
పశ్చిమబెంగాల్ సీఎం మమత మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ నుంచి అసన్సోల్కు వెళ్లేందుకు శనివారం ఆమె హెలికాప్టర్ ఎక్కారు.
మణిపుర్లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బిష్ణూపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులకు తెగబడడంతో ఇద్దరు జవాన్లు మరణించారు.