Home » MLA
పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్బోర్డు బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ఎలాంటి షరతు లేకుండా మద్దతు ప్రకటించాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మంచి వాతావరణం వచ్చింది, ప్రధాని మోదీ మంచి నిర్ణయం తీసుకుని 14 మార్పులు కూడా చేశారన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్ర ప్రజలకు భరోసా వచ్చిందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. ఎమ్మెల్యే మంగళవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీచేశారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రతినెల ఒకటో తేదీ ఇంటి వద్దకు పింఛన వస్తోందా... లేదా.. అని ఆరాతీశారు.
బ్యాంకాక్లో చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పెళ్లికి హాజరు అవ్వడం కోసం మక్కన్ సింగ్ భార్యాబిడ్డలు బ్యాంకాక్ వెళ్లి.. అక్కడ భూకంప విధ్వంసంలో చిక్కుకున్నారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మం డల పరిధిలోని నీలారెడ్డిపల్లిలో శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకు లను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళలర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే పరి టాల సునీత పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడులోని టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ 43వ ఆవిర్బావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. టీడీపీ నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు.
రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కుటుంబానికి బ్యాంకాక్లో ప్రాణాపాయం తప్పింది. అక్కడ చోటుచేసుకున్న భూకంపం నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ అలవాల రమేశ్రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు 48 గంటల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు
మండలంలో ఎవరు అభివృద్ధి పనులు చేశారు? నీళ్లు ఎవరు తెచ్చారు?’ అని వైసీ నాయకులను నిలదీసి అడగండని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఎమ్మెల్యే గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 1.20కోటితో నిర్మంచిన తలుపూరు తారురోడ్డు, రూ.15లక్షలుతో నిర్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించారు.
పార్టీ పలుమార్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నామని పేర్కొంటూ పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ అధికారికంగా బసనగౌడ పాటిల్ యత్నాల్కు ఒక లేఖలో తెలియజేసింది.
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలనానికి తెరలేపారు. బీజేపీలోనే నాకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారానికే దారితీశాయి. బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అనడం గమనార్హం.